Three Senior IPS Suspended in AP: బాలీవుడ్ నటి కేసులో కీలక పరిణామం, ఆ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లపై వేటు వేసిన చంద్రబాబు ప్రభుత్వం, వైసీపీ నేతతో కలిసి వేధించారని ఫిర్యాదు
ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు(PSR Anjaneyulu) , విజయవాడ మాజీ సీపీ కాంతారాణా టాటా (Kanthi rana Tata) , విశాల్ గున్ని (Vishal gunni) ని సస్పెండ్ చేస్తూ ఆదివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో విజయవాడలో పనిచేసిన అప్పటి ఏసీపీ హనుమంతరావు, నాటి ఇబ్రహీంపట్నం సీఐ ఎం సత్యనారాయణపై ఉన్నతాధికారులు వేటు వేశారు.
Vijayawada, SEP 15: ఏపీలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం సస్పెన్షన్ చేసింది. ముంబై నటి కాదంబరి జెత్వాని (Kadambari Jatwani) పై అక్రమంగా పెట్టిన కేసులో ముగ్గురు ఐపీఎస్(IPS) అధికారులు ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా నిర్దారణ కావడంతో వారిపై చర్యలు తీసుకున్నారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు(PSR Anjaneyulu) , విజయవాడ మాజీ సీపీ కాంతారాణా టాటా (Kanthi rana Tata) , విశాల్ గున్ని (Vishal gunni) ని సస్పెండ్ చేస్తూ ఆదివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో విజయవాడలో పనిచేసిన అప్పటి ఏసీపీ హనుమంతరావు, నాటి ఇబ్రహీంపట్నం సీఐ ఎం సత్యనారాయణపై ఉన్నతాధికారులు వేటు వేశారు.
వైసీపీ హయాంలో ముంబైకి చెందిన పారిశ్రామికవేత్తతో కాదంబరి జత్వానికి మధ్య జరిగిన వివాదం పంచాయతీ ఏపీలోని వైసీపీ కీలక నేత వద్దకు వచ్చింది. దీంతో ఆ కీలకనేత పారిశ్రామికవేత్తతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా అతడిని కాపాడేందుకు పోలీసుల బాస్లను ఉపయోగించాడు. దీంతో పోలీసు అధికారులు జత్వానిపై అక్రమంగ కేసులు పెట్టి తల్లిదండ్రులతో పాటు ఆమెను జైలులో ఉంచారు.
అనంతరం ఆమెను బెదిరించి సంతకాలు తీసుకుని కేసును సెటిల్మెంట్ చేశారు. అనంతరం ఏపీలో ఎన్నికలు జరుగడం వైసీపీ అధికారం కోల్పోవడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నటి జత్వాని కొత్త ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. దీంతో ముఖ్యమంత్రి స్పందించి విచారణ ఆదేశించడంతో పాటు విచారణ కమిటీని నియమించి వారి నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా ఐపీఎస్లను సస్పెన్షన్ చేసింది.
(The above story first appeared on LatestLY on Sep 15, 2024 08:12 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

