Telangana Congress Election Committee: రేవంత్ రెడ్డికే చైర్మన్ పదవి, మొత్తం 26 మందితో తెలంగాణ ఎన్నికల కమిటీ ప్రకటించిన ఏఐసీసీ
తెలంగాణకు అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎన్నికల కమిటీని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రకటించింది. ఈ కమిటీకి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఛైర్మన్గా నియమించింది. మొత్తం 26 మందితో కమిటీలో ఉన్నారు. పార్టీలోని సీనియర్ నేతలకు చోటు కల్పించింది.
Hyd, July 20: తెలంగాణకు అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎన్నికల కమిటీని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రకటించింది. ఈ కమిటీకి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఛైర్మన్గా నియమించింది. మొత్తం 26 మందితో కమిటీలో ఉన్నారు. పార్టీలోని సీనియర్ నేతలకు చోటు కల్పించింది.
ఎన్నికల కమిటీ సభ్యులు వీరే: చైర్మన్ - రేవంత్ రెడ్డి, సభ్యులు - భట్టి విక్రమార్క మల్లు, తాటిపత్రి జీవన్రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి, గీతారెడ్డి, మహ్మద్ అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, జానారెడ్డి, వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, దామోదర రాజనర్సింహ, మధుయాష్కీ గౌడ్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, చల్లా వంశీ చంద్ రెడ్డి, ఎస్.ఏ సంపత్ కుమార్, రేణుకా చౌదరీ, పోరికా బలరాం నాయక్, పొడెం వీరయ్య, సీతక్క, మహ్మద్ అలీ షబ్బీర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రేమ్సాగర్ రావు, ఎం.సునీతారావు ఉన్నారు.
జైళ్లు సిద్ధం చేసుకోండి కేసీఆర్..మేమంతా రెడీ, బీజేపీ నేతల హౌస్ అరెస్టుపై కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
ఎక్స్ ఆఫీషియో సభ్యులు: ఈ ఎన్నికల కమిటీలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎన్ఎస్ యూ ఐ అధ్యక్షుడు, సేవాదళ్ చీఫ్ అర్గైనైజర్స్ కు ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా అవకాశం కల్పించారు.

గత శుక్రవారం తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీని ఏఐసీసీ నియమించింది. ప్రచార కమిటీ చైర్మన్గా మధు యాష్కీని నియమించగా, ప్రచార కమిటీ కో చైర్మన్గా పొంగులేటి శ్రీనివాస రెడ్డిని ఎంపిక చేసింది. ప్రచార కమిటీ కన్వీనర్గా సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్ను నియమించగా, 37 మంది సభ్యులతో కమిటీని నియమించినట్లు ఏఐసీసీ పేర్కొంది.
(The above story first appeared on LatestLY on Jul 20, 2023 06:46 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

