Devi Idol Vandalized: హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ లో అమ్మవారి విగ్రహం ధ్వంసం.. కరెంట్ కట్ చేసి, సీసీ కెమెరాలు ధ్వంసం చేసి దుండగుల దుశ్చర్య.. (వీడియో)

హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ లో దారుణం జరిగింది. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎగ్జిబిషన్ సొసైటీ, సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మ‌వారి విగ్ర‌హాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు.

Devi Idol Vandalized: హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ లో అమ్మవారి విగ్రహం ధ్వంసం.. కరెంట్ కట్ చేసి, సీసీ కెమెరాలు ధ్వంసం చేసి దుండగుల దుశ్చర్య.. (వీడియో)
Devi Idol Vandalized (Credits: X)

Hyderabad, Oct 11: హైదరాబాద్ (Hyderabad) లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ లో దారుణం జరిగింది. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎగ్జిబిషన్ సొసైటీ, సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మ‌వారి విగ్ర‌హాన్ని (Devi Idol Vandalized) కొందరు దుండగులు ధ్వంసం చేశారు. శనివారం రాత్రి దాండియా కార్య‌క్ర‌మం నిర్వహించారు. ఇది పూర్తయ్యే వరకూ ఎక్సిబిషన్ గ్రౌండ్స్‌ లోనే పోలీసులు గస్తీ నిర్వహించారు. అయితే, అర్థ‌రాత్రి ఎవ‌రూ లేని స‌మ‌యంలో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు తన అకృత్యాన్ని ప్రదర్శించారు.

ఏపీకి పొంచిఉన్న వాయుగుండం ముప్పు.. సోమవారం నుంచి భారీ వర్షాలకు అవకాశం.. వాతావరణ శాఖ హెచ్చరికలు

అలా పవర్ కట్ చేసి..

వేదిక దగ్గర కరెంట్ కట్ చేసి, సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, అమ్మ‌వారి విగ్రహం చేతిని దుండ‌గులు విరగ్గొట్టారు. సమాచారం అందుకున్న బేగంబజార్ పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకొని కేసు నమోదు చేశారు.

ముగిసిన పారిశ్రామిక దిగ్గ‌జం అంత్య‌క్రియ‌లు, పార్సి సాంప్ర‌దాయం ప్రకార‌మే కానీ..నూత‌న ప‌ద్ద‌తిలో అంత్య‌క్రియ‌ల నిర్వ‌హ‌ణ‌

(The above story first appeared on LatestLY on Oct 11, 2024 09:27 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).