Rain Alert to AP: ఏపీకి పొంచిఉన్న వాయుగుండం ముప్పు.. సోమవారం నుంచి భారీ వర్షాలకు అవకాశం.. వాతావరణ శాఖ హెచ్చరికలు
దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం క్రమంగా తీవ్ర వాయుగుండంగా మారి అనంతరం అది బలపడి తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Vijayawada, Oct 11: దక్షిణ బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన ఉపరితల ఆవర్తనం క్రమంగా తీవ్ర వాయుగుండంగా మారి అనంతరం అది బలపడి తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కారణం చేత వచ్చే సోమవారం నుంచి ఏపీలో (Andhrapradesh) మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ నెల 17 నాటికి ఏపీలోనే ఈ వాయుగుండం తీరం దాటవచ్చని అంచనా వేశారు. అటు రాయలసీమ జిల్లాల్లో కూడా వర్షాలు పడొచ్చని తెలిపారు.
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
పల్నాడు, శ్రీసత్యసాయి, ఏలూరు, ప్రకాశం, పశ్చిమగోదావరితో పాటు పలు జిల్లాల్లో నేడు పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది.
(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

