Karnataka: రష్మిక మందన్నకు రక్షణ కల్పించాలి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి కుమార్ గౌడ వివాదాస్పద నేపథ్యంలో రష్మికకు మద్దతుగా కొడవ సమాజం

కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి కుమార్ గౌడ వివాదాస్పద వ్యాఖ్యల అనంతరం రష్మిక మందన్నకు రక్షణ కల్పించాలని కోరింది కొడవా సమాజం.

Karnataka: రష్మిక మందన్నకు రక్షణ కల్పించాలి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి కుమార్ గౌడ వివాదాస్పద నేపథ్యంలో రష్మికకు మద్దతుగా కొడవ సమాజం
Kodava Community Seeks Protection for Rashmika Mandanna.. here are the details

Hyd, March 09:  కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి కుమార్ గౌడ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కొడవా సమాజం, నటీ రష్మిక మందన్న(Karnataka)కు భద్రతను కల్పించాలని అధికారులను కోరింది. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి కుమార్ గౌడ గణిగా, "రష్మిక మందన్నకు బుద్ధి చెప్పాలి" అనే వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. దీంతో కొడవా సమాజం ఆమె భద్రతను పెంచాలని అధికారులకు విజ్ఞప్తి చేసింది.

మార్చి 3న మీడియాతో మాట్లాడిన సందర్భంగా రవి కుమార్ గౌడ గణిగా, "రష్మిక మందన్న, కిరిక్ పార్టీ సినిమాతో తన కెరీర్‌ను కర్ణాటకలో ప్రారంభించింది. కానీ, గతేడాది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి పిలిచినా, రావడానికి నిరాకరించింది. ‘నా ఇల్లు హైదరాబాద్‌లో ఉంది, నాకు కర్ణాటక ఎక్కడుందో తెలియదు, నాకు టైం లేదు’ అంటూ చెప్పిందట. మా ఓ ఎమ్మెల్యే 10-12 సార్లు ఆమెను ఆహ్వానించడానికి ఇంటికి వెళ్లినా, ఆమె నిర్లక్ష్యంగా స్పందించింది. కన్నడను అస్సలు గుర్తించకుండా వ్యవహరించింది. ఇలాంటి వారిని బుద్ధి నేర్పించకూడదా?" అని వ్యాఖ్యానించారు.

ఛావా సినిమా ఎఫెక్ట్.. గుప్త నిధుల వేటలో పడ్డ జనం, సినిమాలో నిధి గురించి పుకార్లు వచ్చిన నేపథ్యంలో ప్రజల తవ్వకాలు, వీడియో ఇదిగో 

కొడవా నేషనల్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎన్.యు. నాచప్ప, "రష్మిక మందన్న, భారతీయ సినీ పరిశ్రమలో తన కృషి, ప్రతిభతో గొప్ప పేరు తెచ్చుకుంది. కానీ, కొన్ని వ్యక్తులు, కళాత్మక స్వేచ్ఛ గురించి తెలియక, ఆమెను టార్గెట్ చేస్తున్నారు," అని వ్యాఖ్యానించారు.

అంతేగాక, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కర్ణాటక రాష్ట్ర హోం మంత్రి జి. పరమేశ్వర లకు ఓ లేఖను సమర్పించి, రష్మిక మందన్నతో పాటు, కొడవా సమాజానికి చెందిన మహిళల భద్రతను కల్పించాలని కోరారు.

ఆమె గొప్ప నటి మాత్రమే కాక, తన స్వేచ్ఛకు హక్కు ఉన్న వ్యక్తి కూడా. ఎవరూ, తమ అంచనాలకు అనుగుణంగా ఆమెను నడిపించలేరు," అని లేఖలో స్పష్టం చేశారు. ఇటీవల విడుదలైన 'పుష్ప 2: ది రూల్', 'ఛావా' చిత్రాలు బ్లాక్‌బస్టర్‌లుగా నిలిచాయి. రాబోయే రోజుల్లో ఆమె సల్మాన్ ఖాన్‌తో ‘సికందర్’, ధనుష్‌తో ‘కుబేర’, ఆయుష్మాన్ ఖురానాతో ‘థామా’ చిత్రాల్లో కనిపించనుంది.

(The above story first appeared on LatestLY on Mar 09, 2025 07:16 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).