
ప్రముఖ ఆటో మొబైల్ వాహన సంస్థ బజాజ్ ఆటో..తాజాగా ఎలక్ట్రిక్ ఆటో సెగ్మెంట్లోకి అడుగుపెట్టింది. గోగో బ్రాండ్తో సరికొత్త ఆటోలను మార్కెట్కు పరిచయం చేసింది. సింగిల్ చార్జింగ్తో 251 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. రెండు రకాల్లో లభించనున్న ఈ ఆటోల్లో గోగో పీ5009 రకం ధర రూ.3,26,797 గాను, పీ7012 ధర రూ.3,93,004గా నిర్ణయించింది. బ్యాటరీపై సంస్థ ఐదేండ్లపాటు వ్యారంటీ కల్పించింది.
బజాజ్ ఆటో లిమిటెడ్ ఇంట్రా సిటీ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ సమర్దీప్ సుబంధ్ మాట్లాడుతూ, "ఆల్-ఎలక్ట్రిక్ బజాజ్ గోగో శ్రేణి త్రిచక్ర వాహనాల ప్రారంభం ఈ విభాగానికి కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తుంది. 251 కిలోమీటర్ల వరకు సర్టిఫైడ్ రేంజ్తో, సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లతో మరియు విశ్వసనీయ బజాజ్ విశ్వసనీయత మరియు సేవతో బజాజ్ గోగో ఆదాయాలను పెంచుకోవాలని మరియు డౌన్టైమ్ మరియు నిర్వహణ ఇబ్బందులను తగ్గించాలని చూస్తున్న కస్టమర్లకు సమగ్ర పరిష్కారాన్ని అందిస్తుంది" అని అన్నారు.బజాజ్ గోగో ఇప్పుడు అన్ని బజాజ్ 3-వీలర్ డీలర్షిప్లలో పాన్-ఇండియా బుకింగ్ కోసం అందుబాటులో ఉందని కంపెనీ తెలిపింది.