Stephen Raveendra: సైబరాబాద్ సీపీగా స్టీఫెన్ రవీంద్ర, నక్సలైట్లను ఏరివేయడంలో స్పెషలిస్ట్, వరంగల్‌లో ఏపీ డీజీపీ సవాంగ్‌తో కలిసి పనిచేసిన ముత్యాల స్టీఫెన్ రవీంద్ర పూర్తి బయోగ్రఫీ ఇదే...
Stephen Raveendra Appointed as New Cyberabad Commissioner (Photo-Twitter)

Hyderabad, August 25: తెలంగాణలో ఐపీఎస్ ల బదిలీలు జరిగాయి. సైబరాబాద్ నూతన పోలీస్ కమిషనర్ గా స్టీఫెన్ రవీంద్రని (Stephen Raveendra) నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కమిషనర్ గా ఉన్న సజ్జనార్ ను ఆర్టీసీ ఎండీగా నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. కొత్త సీపీగా నియమితులైన ముత్యాల స్టీఫెన్ రవీంద్ర (M. Stephen Raveendra) 1999 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్, హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందారు. 20 సెప్టెంబర్ 1999 న IPS లో చేరారు. రవీంద్ర వెస్ట్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, హైదరాబాద్ సిటీ పోలీస్, గ్రేహౌండ్స్ యొక్క ప్రత్యేక ప్రత్యేక దళాలలో DIG గా ఉన్నారు.

ముత్యాల స్టీఫెన్ రవీంద్ర ప్రముఖ పోలీస్ ఆఫీసర్ M. B. రంజిత్ కుమారుడు. ఆయన తండ్రి గతంలో అసిఫ్ నగర్ డివిజన్, హైదరాబాద్ సిటీ పోలీసు అసిస్టెంట్ కమిషనర్ గా చేసి రిటైర్ అయ్యారు. రవీంద్ర సెయింట్ పాల్స్ ఉన్నత పాఠశాలలో ప్రాధమిక విద్యాభ్యాసం, లిటిల్ ఫ్లవర్ జూనియర్ కళాశాల, నిజాం కళాశాలలో కాలేజీ విద్యను పూర్తి చేశాడు. 1994 లో నిజాం కళాశాల నుండి ఉత్తీర్ణత సాధించాడు. తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్‌లో జంతుశాస్త్ర విభాగంలో జాయిన్ అయ్యారు. ప్రొఫెసర్లు ఎస్. స్టీఫెన్ ఎంటమాలజీ ద్వారా ఉత్సాహాన్ని పొందాడు. దానిలో నైపుణ్యం పొందాడు మరియు 1996 లో యూనివర్సీటీలో జంతుశాస్త్ర విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ లో బంగారు పతకం సాధించాడు.

సైబరాబాద్‌ సీపీ బదిలీ, కొత్త కమిషనర్‌‌గా స్టీఫెన్ రవీంద్ర, సజ్జనార్‌ను ఆర్టీసి ఎండీగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ, సీపీగా సంచలన కేసులను చేధించిన ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్

అనంతరం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో సెలక్ట్ అయి ఐపీఎస్ లో చేరారు. తొలి పోస్టింగ్ వరంగల్ జిల్లాలో జరిగింది. అక్కడ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా పని చేసిన నేటీ ఏపీ డీజీపీ సవాంగ్ తో పనిచేసి రాటు దేలారు. రవీంద్ర వరంగల్ జిల్లాలో ఉన్నప్పుడు నోయల్ స్వరణ్‌జిత్ సేన్ డైరెక్టర్ జనరల్ మరియు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా ఉన్నారు. స్వరణ్‌జిత్-సవాంగ్-స్టీఫెన్ ద్వయం వరంగల్ జిల్లాలో నక్సలైట్లను ఏరివేయడంలో సమర్థవంతంగా పనిచేసింది.

కాగా రవీంద్ర ఆంధ్ర ప్రదేశ్ కొత్త ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమితులయ్యారని అప్పట్లో వార్తలు కూడా హల్ చల్ చేశాయి. అయితే అవి అలానే ఉండిపోయాయి. తాజాగా సైబరాబాద్ సీపీగా రవీంద్ర కొత్త బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటివరకు రవీంద్ర కెరీర్‌లో రంగల్ ఎస్ పీగా ఉన్న సమయంలో అతను నక్సలిజం, అనంతపురంలోని ఎస్‌పిగా ఎస్ పిగా ఉన్నప్పుడు ఫ్యాక్షనిజం, కరీనంగర్ ఎస్ పీగా ఉన్నప్పుడు అవినీతి , DCP-in-East Zoneగా ప్రాంతీయ వాదం, DCP- ఇన్-వెస్ట్ జోన్ గా ఉన్న సమయంలో డ్రగ్స్ నిర్మూలించడంలో సమర్థవంతమైన పాత్రను పోషించారు.

వెస్ట్ జోన్ అధికార పరిధిలోని ప్రాంతాలలో మాదకద్రవ్యాలను కలిగి ఉన్న వ్యక్తులను తరచుగా అరెస్టు చేస్తూ రవీంద్ర వార్తల్లోకెక్కారు. గతంలో మాజీ పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ డ్రగ్స్‌పై యుద్ధం" అనే అంశంపై హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్‌లో నిర్వహించిన సెమినార్‌లో కూడా ప్రసంగించారు. గతంలో అగ్నిప్రమాదంలో చిక్కుకున్న 61 మంది రోగుల ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించిన రవీంద్రకు కేంద్రం నుంచి పతకం కూడా లభించింది. తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నందుకు కేంద్రం నుంచి గాలంటరీ మెడల్ లభించింది.