Telangana Shocker: రాత్రి ఇంట్లో మద్యం సీసాలు, అక్క అనుమానాస్పద మృతి, తెల్లారేసరికి ప్రియుడితో చెల్లెలు పరార్, మిస్టరీగా మారిన మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా, ఆమె సోదరి అదృశ్యమైంది. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం పట్టణంలోని తన ఇంట్లో దీప్తి(24) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

Telangana Shocker: రాత్రి ఇంట్లో మద్యం సీసాలు, అక్క అనుమానాస్పద మృతి, తెల్లారేసరికి ప్రియుడితో చెల్లెలు పరార్, మిస్టరీగా మారిన మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి
Dead Body. (Photo Credits: Pixabay)

కోరుట్ల, ఆగస్టు 30: ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా, ఆమె సోదరి అదృశ్యమైంది. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం పట్టణంలోని తన ఇంట్లో దీప్తి(24) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. హైదరాబాద్‌కు చెందిన ఓ కంపెనీలో ఉద్యోగి అయిన ఆమె ఇంటి నుంచి పనిచేస్తోంది.

బంధువు గృహప్రవేశానికి హాజరయ్యేందుకు తల్లిదండ్రులు ఆదివారం హైదరాబాద్‌కు వెళ్లగా దీప్తి, చందన ఇంట్లోనే ఉన్నారు. సోమవారం రాత్రి బి.శ్రీనివాస్‌రెడ్డి, మాధవి తమ కుమార్తెలతో ఫోన్‌లో మాట్లాడారు. మంగళవారం మధ్యాహ్నం మళ్లీ వారికి ఫోన్ చేశారు. దీప్తి ఫోన్ ఎత్తకపోగా, చందన ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది.

ఆందోళనకు గురైన తల్లిదండ్రులు తమ కూతుళ్లను చూడాలని ఇరుగుపొరుగు వారికి ఫోన్ చేశారు. ఇరుగుపొరుగు వారు ఇంటికి వెళ్లి చూడగా చందన కనిపించకపోవడంతో దీప్తి శవమై పడి ఉండడం చూసి షాక్ తిన్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సోఫాలో దీప్తి మృతదేహాన్ని గుర్తించారు. వంటగదిలో రెండు మద్యం సీసాలు, కూల్ డ్రింక్ సీసాలు, కొన్ని స్నాక్ ప్యాకెట్లు లభ్యమయ్యాయి.

గచ్చిబౌలిలో దారుణం, మహిళను కనస్ట్రక్షన్ బిల్డింగ్‌లోకి లాక్కెళ్లి గ్యాంగ్ రేప్, అనంతరం బండరాయితో కొట్టి చంపిన కామాంధులు

పోలీసులు మృతదేహాన్ని శవపరీక్షకు పంపించి చందన కోసం గాలింపు చేపట్టారు. వారు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, ఆమె ఒక యువకుడితో కలిసి ఉదయం 5.30 గంటలకు నిజామాబాద్‌కు బస్సు ఎక్కినట్లు గుర్తించారు. చందన, గుర్తుతెలియని యువకుడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రవీందర్ రెడ్డి తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

మద్యం బాటిళ్లు ఎవరు తీసుకొచ్చారు, ఇంకా ఎవరైనా మద్యం సేవించి ఉన్నారా, చందన ఎందుకు తప్పించుకుందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బీటెక్ చేసిన చందన ఇంట్లోనే ఉంటోంది. సీసీటీవీ ఫుటేజీలో కనిపించిన యువకుడు ఆమె ప్రియుడిగా అనుమానిస్తున్నారు. మెట్‌పల్లి డీఎస్పీ వంగ రవీందర్‌రెడ్డి, సీఐ లక్ష్మీనారాయణ, ఎస్సైలు కిరణ్‌, చిరంజీవి ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

దారుణం, హస్టల్ గదిలో బాలుడిపై ప్యూన్ అత్యాచారం, నొప్పి అని ఏడుస్తున్నా అరవకుండా నోరు కప్పి పని కానిచ్చిన కామాంధుడు

కోరుట్ల బస్టాండ్‌లోని సీసీ కెమెరాల్లో మంగళవారం వేకువజామున 5 గంటలకు చందన ఓ యువకుడితో కలిసి ఉన్న వీడియోలను పోలీసులు గుర్తించారు. చందన, మరో యువకుడు లగేజీ తీసుకుని నిజామాబాద్‌ వైపు వెళ్లే బస్సు ఎక్కినట్లు సీసీ పుటేజీల్లో రికార్డు అయింది. చందన ఫోన్‌కాల్‌ డేటా ఆధారంగా ఆమె ఓ యువకుడితో గంటల తరబడి ఫోన్‌ మాట్లాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మంగళవారం రాత్రి చందన ఫోన్‌ లొకేషన్‌ హైదరాబాద్‌లో వస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారని సమాచారం. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కోరుట్ల సీఐ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

(The above story first appeared on LatestLY on Aug 30, 2023 12:42 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).