Telangana: షాకింగ్ వీడియో.. వరదల్లో చిక్కుకుని 30 మంది విద్యార్థుల ఆర్తనాదాలు, అండర్ బ్రిడ్జి వద్ద వరద నీటిలో చిక్కుకున్న స్కూలు బస్సు, డ్రైవర్ అప్రమత్తమవడంతో తప్పిన పెను ప్రమాదం
మహబూబ్నగర్ కోడూరు వద్ద వరదలో ఓ ప్రైవేటు పాఠశాల బస్సు చిక్కుకుపోయింది. అయితే డ్రైవర్ అప్రమత్తమవడంతో ప్రమాదం తప్పింది. స్థానికుల సహాయంతో బస్సులో ఉన్న విద్యార్థులను క్షేమంగా బయటకు తీసుకువచ్చారు.
- Read in
- తెలుగు
మహబూబ్నగర్ కోడూరు వద్ద వరదలో ఓ ప్రైవేటు పాఠశాల బస్సు చిక్కుకుపోయింది. అయితే డ్రైవర్ అప్రమత్తమవడంతో ప్రమాదం తప్పింది. స్థానికుల సహాయంతో బస్సులో ఉన్న విద్యార్థులను క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. గురువారం రాత్రి కురిసిన వానతో కోడూరు-మాచన్పల్లి మధ్య ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జిలోకి భారీగా వరద నీరు చేరింది. అయితే రామచంద్రపూర్, మాచన్పల్లి, సుగుర్గడ్డ తండా నుంచి జిల్లా కేంద్రంలో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలకు విద్యార్థులు స్కూలు బస్సులో వెళ్తున్నారు.
ఈ క్రమంలో అండర్ బ్రిడ్జి వద్ద నిలిచిన వరద నీటిలో బస్సు చిక్కుకుపోయింది. ఆ సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారు. ట్రాక్టర్ సహాయంతో స్కూలు బస్సును బయటకు తీశారు. చిన్నారులంతా క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై రైల్వే శాఖ నిర్లక్ష్యంతోనే జరుగుతున్నాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. మహబూబ్నగర్ రూరల్ మండలం సూగూరు గడ్డ- మన్నెంకొండ స్టేషన్ల మధ్య రైల్వే అండర్ పాస్లో ప్రైవేటు స్కూలు బస్సు చిక్కుకున్న ఘటనపై మంత్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
💥బ్రేకింగ్ న్యూస్.💥మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ రూరల్ మండలం మన్నెకొండ రైల్వే గేట్ సమీపంలో సూకూర్ గడ్డ తండా మన్నెంకొండ రైల్వే గేట్ వద్ద రైల్వే అండర్ పాస్ లో భాష్యం పాఠశాలకు చెందిన బస్సు చిక్కుకోవడంతో పూర్తిగా బస్సు నీటిలో మునిగిపోయింది.ఘటన జరిగిన సందర్భంలో బస్సులో సుమారు 30..1/2 pic.twitter.com/Z3Co4tCoME
— INTUC President Of Telengana (@Sai_alikachenu) July 8, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 08, 2022 04:47 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

