Wife Killed Husband: కూతురి సాయంతో భర్తను చంపిన భార్య, ఇంట్లోనే వరం పాటు శవాన్ని పెట్టి డ్రామాలు, పెట్రోల్ పోసి కాల్చేందుకు యత్నం, సగమే కాలిపోవడంతో హడావుడిగా అంత్యక్రియలు, సినిమా ట్విస్టులను మించిన క్రైమ్ చిత్రం

మద్యానికి బానిసై, వివాహేతర సంబంధాలకు అలవాటుపడి ఇంట్లో వారిని దుర్భాషలాడటం, కొట్టడంతో విసుగెత్తిపోయిన భార్య.. కూతురు సాయంతో భర్తను దారుణంగా హత్య చేశారు. శవాన్ని మాయం చేసే ప్రయత్నంలో వారం రోజులు మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచారు.

Wife Killed Husband: కూతురి సాయంతో భర్తను చంపిన భార్య, ఇంట్లోనే వరం పాటు శవాన్ని పెట్టి డ్రామాలు, పెట్రోల్ పోసి కాల్చేందుకు యత్నం, సగమే కాలిపోవడంతో హడావుడిగా అంత్యక్రియలు, సినిమా ట్విస్టులను మించిన క్రైమ్ చిత్రం
Image used for representational purpose | (Photo Credits: PTI)

Siricilla, NOV 08: సిరిసిల్ల జిల్లాలో (Siricilla Murder) దారుణం జరిగింది. వేధింపులకు గురి చేస్తున్న భర్తను భార్య హత మార్చారు (Wife Killed Husband). కూతురు సాయంతో భర్తను భార్య హత్య చేసింది. మద్యానికి బానిసై, వివాహేతర సంబంధాలకు అలవాటుపడి ఇంట్లో వారిని దుర్భాషలాడటం, కొట్టడంతో విసుగెత్తిపోయిన భార్య.. కూతురు సాయంతో భర్తను దారుణంగా హత్య చేశారు. శవాన్ని మాయం చేసే ప్రయత్నంలో వారం రోజులు మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచారు. మృతదేహాన్ని ఇంట్లోనే పూడ్చి పెట్టాలని భావించారు. కుదరకపోవడంతో పెట్రోల్ పోసి తగలబెట్టే ప్రయత్నం చేశారు. ఏదీ కుదరకపోవడంతో హడావుడిగా అంత్యక్రియలు చేశారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Kerala Man Gets Life Sentence In US: భార్యను 17 సార్లు కత్తితో పొడిచి చంపిన భర్త, కేరళవాసికి జీవిత ఖైదు విధించిన అమెరికా న్యాయస్థానం 

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణం శివనగర్ కు చెందిన లేచర్ల ప్రకాశ్ రావు (44) జల్సాలకు అలవాటుపడ్డాడు. ఇతర మహిళలతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నాడు. మద్యానికి బానిసై ఇంట్లో వారిపై తరచూ దాడికి దిగుతున్నాడు. వేధింపులు తట్టుకోలేని భార్య స్వప్న, కుమార్తె ఉషశ్రీ ఎలాగైనా అతన్ని చంపాలనుకున్నారు. ప్లాన్ ప్రకారం నవంబర్ 1వ తేదీ రాత్రి భార్య స్వప్న భర్త ప్రకాశ్ రావు (Prakash Rao) మెడపై కూరగాయలు కోసే కత్తితో దాడి చేయగా, కూతురు తండ్రి ముఖంపై దిండుతో ఒత్తిపట్టి హత్య చేశారు.

Fire Accident in Thane: మహారాష్ట్రలో అర్దరాత్రి ఘోర అగ్నిప్రమాదం, పత్తిగోదాములో ఎగిసిపడ్డ మంటలు, ఇద్దరు సజీవ దహనం 

అనంతరం మృతదేహాన్ని గొడ్డలితో ముక్కలు ముక్కలు చేసేందుకు ప్రయత్నించారు. కుదరకపోవడంతో మృతదేహాన్ని మాయం చేయాలని ఇంట్లోనే గుంత తవ్వి పాతి పెడదామనుకున్నారు. కానీ, అలా చేస్తే శవం నుంచి వాసన వచ్చి విషయం బయటికి తెలుస్తుందని భావించారు. పెట్రోల్ పోసి కాల్చివేసే ప్రయత్నం చేసినా మృతదేహం పూర్తిగా కాలిపోలేదు. దీంతో స్వప్న నవంబర్ 3వ తేదీన తన తమ్ముడితో మరింత పెట్రోల్ తెప్పించి మృతదేహంపై పోసి నిప్పంటించారు.

అయితే, మంటలు ఎగిసిపడటంతో తెలుస్తుందని నీళ్లు, దుప్పట్లతో మంటలు ఆర్పివేశారు. ఇలా కూడా మృతదేహాన్ని మాయం చేయడం కుదరకపోవడంతో ఎట్టకేలకు హత్యను కాస్తా ఆకస్మిక మృతిగా చిత్రించి దహనం సంస్కారాలు చేయాలని ప్లాన్ చేశారు. అందులో భాగంగా నవంబర్ 4న నిందితురాలు తన చిన్నాన్నను తెల్లవారుజామున ఇంటికి పిలిపించుకుని జరిగిన విషయాన్ని వివరించింది. ఈ క్రమంలో ప్రకాశ్ రావు నిద్రలో చనిపోయినట్లు బంధువులకు సమాచారం ఇచ్చారు.

(The above story first appeared on LatestLY on Nov 08, 2023 10:33 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).