‘Nokia 4G on The Moon’: చంద్రునిపై నోకియా 4జీ నెట్వర్క్, ప్రాజెక్ట్కు నిధులు అందించనున్నట్లు తెలిపిన నాసా, ఆర్టెమిస్ మిషన్ను 2024 లో ప్రారంభించేందుకు నాసా కసరత్తు
చందమామ మీదకు వెళ్లేందుకు ఆర్టెమిస్ మిషన్ను 2024 లో నాసా ప్రారంభించిందేకు రెడీ అవుతోంది. అయితే దీని కోస నాసాకు సహజంగా సమర్థవంతమైన మరియు నమ్మదగిన కమ్యూనికేషన్ సెటప్ అనేది చాలాఅవసరం. ఈ నేపథ్యంలో నాసా నోకియాతో జత కట్టింది. చంద్రునిపై 4 జి ఎల్టిఇ సెల్యులార్ నెట్వర్క్ను (Nokia 4G Networks On The Moon) నిర్మించేందుకు నోకియాకు భారీ ఎత్తున నిధులు అందించేందుకు నాసా రెడీ అయింది. చంద్రునిపై 14.1 మిలియన్ డాలర్లతో సెల్యులార్ కమ్యూనికేషన్ నెట్వర్క్ను నిర్మించడానికి నోకియా (Nokia) చేపట్టిన ప్రాజెక్ట్కు నిధులు అందించనున్నట్లు నాసా (Nasa) ప్రకటించింది.
చందమామ మీదకు వెళ్లేందుకు ఆర్టెమిస్ మిషన్ను (Artemis mission) 2024 లో నాసా ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. అయితే దీని కోస నాసాకు సమర్థవంతమైన మరియు నమ్మదగిన కమ్యూనికేషన్ సెటప్ అనేది చాలాఅవసరం. దీనికోసం నాసా మొబైల్ దిగ్గజం నోకియాతో జత కట్టింది. చంద్రునిపై 4 జి ఎల్టిఇ సెల్యులార్ నెట్వర్క్ను (Nokia 4G Networks On The Moon) నిర్మించేందుకు నోకియాకు భారీ ఎత్తున నిధులు అందించేందుకు స్సేస్ సంస్థ నాసా రెడీ అయింది. చంద్రునిపై 14.1 మిలియన్ డాలర్లతో సెల్యులార్ కమ్యూనికేషన్ నెట్వర్క్ను నిర్మించడానికి నోకియా (Nokia) చేపట్టిన ప్రాజెక్ట్కు నిధులు అందించనున్నట్లు నాసా (Nasa) ప్రకటించింది.
2028 నాటికి వ్యోమగాములు చంద్రునిపై కొన్ని పనులు ప్రారంభించడానికి నాసా ఇప్పటి నుంచే ప్రయోగాలు చేస్తోంది. ఇప్పటికే చంద్రునిపై నీటి ఆనవాళ్లు ఉన్నట్లు కనుగొన్న శాస్త్రవేత్తలు ఆ ప్రాంతం మానవ నివాస యోగ్యంగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటినుంచే ప్రయోగాలు మొదలు పెట్టారు. ఇవి జరగాలంటే అక్కడ నెట్ వర్క్ (4G LTE Communication) అనేది చాలా అవసరం కాబట్టి నోకియా దీని కోసం ప్రయోగాలు చేస్తోంది. ఈ ప్రయోగాలకు నాసా భారీ ఎత్తున నిధులు అందిస్తామని తెలిపింది.
అంతరిక్షంలో రాకెట్ ప్రొపెల్లెంట్ను తయారు చేయడానికి, దానిని నిర్వహించడానికి ఉపయోపడే సాంకేతికత కోసం దాదాపు 370 మిలియన్ డాలర్ల ఖర్చు అవుతుంది. అయితే వీటిలో ఎక్కువ డబ్బును ఈ సాంకేతికను అందించే స్పేస్ఎక్స్, యునైటెడ్ లాంచ్ అలయన్స్ వంటి అంతరిక్ష సంస్థలకు నాసా అందిస్తోంది. ఇక అనుకున్నట్లు చంద్రునిపై కమ్యూనికేషన్ నెట్వర్క్ను నిర్మిస్తే అక్కడికి వెళ్లే వ్యోమగాములు మొబైల్ ఫోన్లను ఉపయోగించుకోవచ్చు.
యునైటెడ్ ప్రెస్ ఇంటర్నేషనల్ ప్రకారం, నాసా అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ జేమ్స్ రౌటర్ మాట్లాడుతూ 4 జి సెల్యులార్ సేవ వ్యోమగాములకు అంతరిక్ష నౌకతో కమ్యూనికేట్ చేయడానికి చంద్రుడిని అన్వేషించడానికి వీలు కల్పిస్తుంది. "నాసా నిధులతో చంద్ర వాతావరణానికి భూగోళ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా సవరించవచ్చో నోకియా పరిశీలిస్తుందని ఆయన చెప్పారు.
ఇప్పటికే నోకియా జర్మనీ అంతరిక్ష సంస్థ అయిన పిటిఎస్ సైంటిస్టులతో మరియు యుకెకు చెందిన వోడాఫోన్తో చేతులు కలిపింది. నోకియా మరియు వొడాఫోన్ చంద్రునిపై ఎల్టిఇ నెట్వర్క్ను నిర్మించాలని యోచిస్తున్నాయి, ఇది చంద్రుడి నుండి హై-డెఫినిషన్ వీడియోను భూమిపైకి తిరిగి పంపించేదిగా ఉంది. ఇక నోకియా కూడా 5 జి నెట్వర్క్ల కోసం దూకుడుగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఉన్న 4 జి నెట్వర్క్లను 5 జికి అప్గ్రేడ్ చేయగల కొత్త సాఫ్ట్వేర్ టెక్నాలజీని ఫిన్నిష్ కంపెనీ విడుదల చేసింది.
టైర్ I, II, మరియు III నగరాలు కూడా మంచి స్థిరమైన 4 జి నెట్వర్క్లను కలిగి ఉన్న భారతదేశం వంటి దేశాలకు ఇది చాలా సులభం. అయితే ప్రస్తుతానికి, నాసా, నోకియా భాగస్వామ్యం ఆర్టెమిస్ మిషన్లో కీలకమైన అంశం కానుంది. వ్యోమగాములకు కమ్యూనికేషన్ కీలకం కాబట్టి, మంచి LTE సెటప్ కలిగి ఉండటం మిషన్కు చాలా ముఖ్యమైనది. నోకియా సేవలను తెలుసుకోవడం, త్వరలో చంద్రునిపై నమ్మకమైన మరియు స్థిరమైన 4 జి ఎల్టిఇని చూడవచ్చు.
(The above story first appeared on LatestLY on Oct 17, 2020 04:46 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

