Israel-Palestine War: ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం, చిన్నపిల్లలను టార్గెట్ చేసిన ప్రాణాంతక అంటు వ్యాధి మీజిల్స్‌, వెంటనే టీకాలు వేయించాలని ప్రభుత్వం ఆదేశాలు
Israel-Palestine War

ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం మధ్య పిల్లలలో మీజిల్స్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నదని ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. యుద్ధ వాతావరణ నేపధ్యంలో (Israel-Palestine War)మరోసారి దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ దారుణంగా దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. వీటి పర్యవసానాలను దేశంలోని సామాన్య ప్రజలు భరించవలసి ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు.

ఇజ్రాయెల్‌పై హమాస్ అనూహ్య దాడిలో మృతుల సంఖ్య 700కు చేరుకోగా, గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడుల్లో కనీసం 413 మంది మరణించినట్లు సమాచారం. ప్రభుత్వ అధికారులను ఉటంకిస్తూ, ఇజ్రాయెల్ ప్రభుత్వ యాజమాన్యంలోని కాన్ టీవీ వార్త ఆదివారం రాత్రి హమాస్ సంయుక్త దాడిలో కనీసం 700 మంది మరణించినట్లు నివేదించింది. ఆదివారం రాత్రి, ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇజ్రాయెల్ ఆసుపత్రులలో గాయాల సంఖ్యను నవీకరించింది, కనీసం 2,243 మంది గాయపడ్డారని, అందులో 22 మంది పరిస్థితి విషమంగా ఉందని జిన్హువా వార్తా సంస్థ నివేదించింది.

దక్షిణ ఇజ్రాయెల్‌లో, ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటికీ పూర్తి నియంత్రణను తీసుకోలేదు మరియు హమాస్ మిలిటెంట్లు గాజా సమీపంలోని అనేక కమ్యూనిటీలలో ఇజ్రాయెల్ సైనికులతో కాల్పులు కొనసాగిస్తున్నారు. IDF హోమ్ ఫ్రంట్ కమాండ్ దక్షిణాదిలోని నివాసితులను ఇంట్లోనే ఉండమని పిలిచింది. ఇంతలో, గాజా స్ట్రిప్‌పై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడుల వల్ల 2,300 మందికి పైగా గాయపడ్డారు, ఇందులో 213 మంది పిల్లలు మరియు 140 మంది మహిళలు ఉన్నారు.

మీజిల్స్‌ వ్యాధి ఆందోళన

ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నగరంలో రెండేళ్ల వయసుగల నలుగురు పిల్లలు తీవ్రమైన తట్టు(మీజిల్స్‌) వ్యాధి బారిన పడ్డారు. ఈ నేపధ్యంలో ఇజ్రాయెల్ పీడియాట్రిక్ అసోసియేషన్ ఈ ప్రాణాంతక వ్యాధి నివారణకు దేశంలోని చిన్నారులకు టీకాలు వేయాల్సిన అవసరాన్ని ప్రభుత్వానికి నొక్కి చెప్పింది. దేశంలోని తల్లిదండ్రులు తమ పిల్లలకు వెంటనే టీకాలు వేయించాలని వైద్యాధికారులు సూచనలు చేశారు.

ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంలో 1,100 మందికి పైగా మృతి, గాజాలో బాంబు దాడులే లక్ష్యంగా దూసుకెళ్తున్న ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు

తట్టు అనేది వాస్తవానికి రుబియోలా అనే వైరస్ వల్ల కలిగే ఇన్ఫెక్షన్. ఇది ఎక్కువగా పిల్లలపై దాడి చేస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ చాలా వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఇది పిల్లలకు ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. ఈ వైరస్ సోకాక 10 నుండి 14 రోజుల వ్యవధిలో ఈ ఇన్ఫెక్షన్ లక్షణాలు బయపటతాయి. తట్టు లక్షణాలు ఈ విధంగా ఉంటాయి

జ్వరం

పొడి దగ్గు

జలుబు

గొంతు మంట

కళ్లు ఉబ్బడం

చర్మంపై దద్దుర్లు, చర్మంపై చిన్న మచ్చలు

వాస్తవానికి మీజిల్స్(తట్టు) లక్షణాలు సాధారణంగా రోగి ముక్కు, గొంతులో కనిపిస్తాయి. బాధితుడు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు ఈ వైరస్‌ గాలిలో కలుస్తుంది. ఫలితంగా వ్యాధి ఇతరులకు వ్యాప్తి చెందుతుంది. ఈ ప్రమాదకరమైన వ్యాధికి టీకా అందుబాటులో ఉంది. రెండు మోతాదుల టీకా ఈ వ్యాధిని నివారించడంలో, ప్రాణాలను రక్షించడంలో 97 శాతం ప్రభావవంతంగా ఉంటుందని స్పష్టమయ్యింది.