Dasara Special Trains: దసరాకు మరో 9 ప్రత్యేక రైళ్లు.. నేడు నాందేడ్-కాకినాడ మధ్య ప్రత్యేక రైలు, 24న హైదరాబాద్-కటక్, 25న కటక్-హైదరాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు.. కాచిగూడ-రాయచూర్, రాయచూర్-కాకినాడ మధ్య 25 వరకు రైళ్ల రద్దు
Representational (Credits: Facebook)

Hyderabad, Oct 20: దసరా (Dasara) సమీపిస్తున్న వేళ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) మరోమారు గుడ్‌ న్యూస్ (Good News) చెప్పింది. పండుగ కోసం ఇప్పటికే వేసిన ప్రత్యేక రైళ్లు (Dasara Special Trains) కూడా నిండిపోతుండడంతో మరో 9 రైళ్లను ప్రకటించింది. నేడు (20న)నాందేడ్ నుంచి కాకినాడకు ప్రత్యేక రైలు నడుపుతున్నట్టు ప్రకటించింది. ఈ రైలు (07061) నాండేడ్‌లో బయలుదేరి నిజామాబాద్, సికింద్రాబాద్, నల్గొండ మీదుగా కాకినాడకు చేరుకుంటుంది. 24న హైదరాబాద్-కటక్(07165) రైలును ప్రకటించింది. ఇది నల్గొండ, గుంటూరు, విజయవాడ, దువ్వాడ తదితర స్టేషన్ల మీదుగా నడుస్తుంది. 25న కటక్-హైదరాబాద్‌(07166) మధ్య మరో రైలు నడుస్తుందని, ఈ రైలు కూడా ఇదే మార్గంలో ప్రయాణిస్తుందని అధికారులు తెలిపారు. మిగిలిన ప్రత్యేక రైళ్లు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణించవని అధికారులు పేర్కొన్నారు.

WhatsApp New Update: త్వరలో ఒకే సిమ్‌ పై రెండు వాట్సాప్‌ ఖాతాలు.. ‘మెటా’ సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ వెల్లడి

రైళ్ల రద్దు కూడా

నిర్వహణ పరమైన కారణాలతో కాచిగూడ-రాయచూర్ (17693), రాయచూర్-కాచిగూడ(17694) మధ్య రైళ్లను రద్దు చేశారు. ఈ నెల 25 వరకు ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. రైలు ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ రైళ్లు, మార్గాలు ఎంచుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

TS BJP First List: 65 మంది అభ్యర్థులతో నేడు బీజేపీ తొలి జాబితా??.. నేటి సాయంత్రం తొలి జాబితా ప్రకటన వెలువడవచ్చంటూ ఊహాగానాలు.. నిన్న జేపీ నడ్డా ఇంట్లో పలుమార్లు సమావేశమైన కోర్ కమిటీ