South Central Railway: రైల్వే ప్రయాణికులకు విజ్ఞప్తి.. వరంగల్ మీదుగా నడిచే పలు రైళ్ల రద్దు 16 వరకు పొడిగింపు
రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక. వరంగల్ మీదుగా నడిచే పలు రైళ్లను గత నెల 19న రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే తాజాగా మరికొన్ని రోజులు పొడిగించింది.
Hyderabad, July 9: రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక. వరంగల్ (Warangal) మీదుగా నడిచే పలు రైళ్లను (Trains) గత నెల 19న రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తాజాగా మరికొన్ని రోజులు పొడిగించింది. సికింద్రాబాద్ డివిజన్ (Secunderabad Division) పరిధిలో రోలింగ్ కారిడార్ బ్లాక్ కర్యాచరణ ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. పనులు ఇంకా పూర్తి కాలేదని, దీంతో ఈ నెల 16 వరకు రళ్ల రద్దు కొనసాగుతుందని పేర్కొంటూ అన్ని రైల్వే స్టేషన్లకు సమాచారం అందించారు.
రద్దయిన రైళ్లు ఇవే..
- కాజీపేట-డోర్నకల్ (07753)
- డోర్నకల్-కాజీపేట మెము (07754)
- డోర్నకల్-విజయవాడ (07755)
- విజయవాడ-డోర్నకల్ (07756)
- భద్రాచలం రోడ్-విజయవాడ (07278)
- విజయవాడ-భద్రాచలం రోడ్ (07979)
- సికింద్రాబాద్-వరంగల్ (07462)
- వరంగల్-హైదరాబాద్ మెము (07463)
- కాజీపేట-సిర్పూరు టౌన్ (17003)
- బల్లార్షా-కాజీపేట రాంగిరి మెము (17004)
- భద్రాచలం రోడ్-బల్లార్షా (17033),
- సిర్పూరు టౌన్-భద్రాచలం రోడ్ (17034)
(The above story first appeared on LatestLY on Jul 09, 2023 08:59 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

