Road Accident in MP: ఎంపీలో ఘోర రోడ్డు ప్రమాదం, పదిమంది మృతి, 25 మందికి గాయాలు, మధ్య ప్రదేశ్లోని శివపురి జిల్లా పోహ్రి వద్ద విషాద ఘటన
తెల్లారితే దీపావళి..ఆనందంగా దీపావళిని జరుపుకుందామనుకున్న వారి కుటుంబాల్లో రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. దీపావళి ముందు రోజు రాత్రి మధ్య ప్రదేశ్లోని శివపురి జిల్లా పోహ్రి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Madhya Pradesh Road Accident) చోటుచేసుకుంది. 40 మందితో వెళ్తున్న ఓ వ్యాను తిరగబడడంతో అందులో ప్రయాణిస్తున్న 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి తీవ్ర గాయాలైనట్టు శివపురి అదనపు పోలీసు సూపరింటెండెంట్ ప్రవీణ్ కుమార్ భూరియా వెల్లడించారు.
Shivpuri, November 14: తెల్లారితే దీపావళి..ఆనందంగా దీపావళిని జరుపుకుందామనుకున్న వారి కుటుంబాల్లో రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. దీపావళి ముందు రోజు రాత్రి మధ్య ప్రదేశ్లోని శివపురి జిల్లా పోహ్రి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Madhya Pradesh Road Accident) చోటుచేసుకుంది. 40 మందితో వెళ్తున్న ఓ వ్యాను తిరగబడడంతో అందులో ప్రయాణిస్తున్న 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి తీవ్ర గాయాలైనట్టు శివపురి అదనపు పోలీసు సూపరింటెండెంట్ ప్రవీణ్ కుమార్ భూరియా వెల్లడించారు.
దోడి గ్రామానికి చెందిన కొందరు షియోపూర్ జిల్లా ఉనావాద్లో జరిగిన ఓ మత కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సాయంత్రం 7:15 సమయంలో... వేగంగా వెళ్తున్న వ్యాను ఓ ఇరుకైన రోడ్డులో ప్రవేశించగానే ఈ ప్రమాదం జరిగినట్టు శివపురి ఎస్పీ రాజేశ్ సింగ్ చాందేల్ వెల్లడించారు. ఆరుగురు వ్యక్తులు ఘటనా స్థలంలోనే మృతి చెందగా... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్టు ఆయన తెలిపారు. క్షతగాత్రులను పోహ్రి, శివపురి జిల్లా ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు.
భోపాల్కు 312 కిలోమీటర్ల ఉత్తరాన ఉన్న శివపురి జిల్లాలో (Shivpuri district) జరిగిన ఈ ప్రమాదంలొ నలుగురు మహిళలు, ఒక చిన్నారి సహా పది మంది మృతి చెందారు మరియు 25 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను శివపురిలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు, అక్కడ గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని భూరియా చెప్పారు.
మృతులను భరత్ సింగ్ గుర్జర్ (40), షియోపూర్ జిల్లాలోని దోండారి ఖుర్ద్ గ్రామంలో నివసించే నరోత్తం గుర్జార్ (45), కున్వర్పాల్ గుర్జర్, జగ్మోహన్ గుర్జర్, 60, మహారాజ్ సింగ్ గుర్జార్ కుమారుడు, గస్బర్ సింగ్ , 45, దుర్గాబాయి, 28, ఆమె కుమార్తె ప్రతిగ్యా, 4, కమలా బాయి, 50, మున్నీ గుర్జార్, 50, మరియు హార్విలాస్ గుర్జార్ (50), షియోపూర్ జిల్లాలోని దోండారి కలాన్ గ్రామ నివాసితులందరూ పోలీసులు తెలిపారు.
(The above story first appeared on LatestLY on Nov 14, 2020 08:59 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

