Gujarat Road Accident: గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. దాహోద్ -గోధ్రా హైవేపై లగ్జరీ బస్సు స్టేషనరీ బస్సును ఢోకొట్టడంతో నలుగురి మృతి, 11 మందికి గాయాలు
గుజరాత్ లోని పంచమహల్ జిల్లా గోద్రా పట్టణం సమీపంలో ఉన్న హైవేపై తీవ్ర విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఘటన వివరాల్లోకి కెళితే..గోద్రా పట్టణం సమీపంలో మంగళవారం రోజున ఓ ప్రైవేట్ లగ్జరీ బస్సు ఆగి ఉన్న బస్సును ఢీకొట్టడంతో నలుగురు వ్యక్తులు మరణించగా.. మరో 11 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.
Gandhi Nagar, Nov 21: గుజరాత్ లోని పంచమహల్ జిల్లా గోద్రా పట్టణం సమీపంలో ఉన్న హైవేపై తీవ్ర విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఘటన వివరాల్లోకి కెళితే.. గోద్రా పట్టణం సమీపంలో మంగళవారం రోజున ఓ ప్రైవేట్ లగ్జరీ బస్సు ఆగి ఉన్న బస్సును ఢీకొట్టడంతో నలుగురు వ్యక్తులు మరణించగా.. మరో 11 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.మృతుల్లో ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలుస్తోంది.
ఇండోర్ కు వెళ్లే బస్సు సాంకేతిక లోపం రావడంతో వాహనం రోడ్డు పక్కన ఆగిపోయింది. ఈ నేపథ్యంలో రోడ్డు పక్కన ఉంచి మరమ్మత్తులు చేస్తుండగా.. తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో వెనక నుంచి బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దాహోద్-గోధ్రా హైవేపై ఈ దారుణ సంఘటన చోటు చేసుకుందని.. గోద్రా సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ ప్రవీణ్ సింగ్ జయతావత్ వ్యక్తం చేసాడు.
దాహొద్ నుండి వస్తున్న లగ్జరీ బస్సు డ్రైవర్ ముందు ఆగి ఉన్న బస్సును గుర్తించలేకపోయాడు. దీంతో ఆగి ఉన్న బస్సును వెనుక నుండి ఢీకొట్టగా..ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు- ఇద్దరు మహిళలు , ఇద్దరు పిల్లలు అక్కడిక్కడే మరణించారని అధికారులు తెలియజేసారు.
(The above story first appeared on LatestLY on Nov 21, 2023 03:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

