Coronavirus in India: దేశంలో తగ్గుతున్న కరోనా తీవ్రత, స్వల్పంగా పెరిగిన కరోనా యాక్టీవ్ కేసులు, వ్యాక్సినేషన్ లో కొనసాగుతున్న జోష్, గతంతో పోలిస్తే తగ్గిన మరణాల రేటు
భారత్ లో కరోనా క్రమంగా తీవ్రత తగ్గుతోంది. రోజు రోజుకూ కరోనా కేసులు తగ్గతున్నాయి. నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 13,166 కరోనా కేసులు (Daily Corona cases) నమోదయ్యాయి. గురువారం నాడు దేశవ్యాప్తంగా కరోనా బారిన పడి 302 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,13,226 కి చేరింది.
New Delhi Feb 25: భారత్ లో కరోనా క్రమంగా తీవ్రత తగ్గుతోంది. రోజు రోజుకూ కరోనా కేసులు తగ్గతున్నాయి. నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 13,166 కరోనా కేసులు (Daily Corona cases) నమోదయ్యాయి. గురువారం నాడు దేశవ్యాప్తంగా కరోనా బారిన పడి 302 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,13,226 కి చేరింది. ఇక కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య మాత్రం గణనీయంగా పెరుగుతుండటం ఊరటనిస్తోంది. నిన్న ఒక్కరోజే 26,988 మంది కరోనా మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య (Corona Active cases) కూడా క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,34,235 యాక్టీవ్ కేసులున్నాయి. అటు రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు (Daily positivity rate) భారీగా తగ్గింది. ప్రస్తుతం 1.28% శాతంగా ఉంది.
India reports 13,166 fresh #COVID19 cases, 26,988 recoveries, and 302 deaths in the last 24 hours.
Active case: 1,34,235 (0.31%)
Daily positivity rate: 1.28%
Total recoveries: 4,22,46,884
Death toll: 5,13,226
Total vaccination: 1,76,86,89,266 pic.twitter.com/kPbKxRCBzk
— ANI (@ANI) February 25, 2022
కేరళతో పాటూ కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కూడా కరోనా తీవ్రత తగ్గుతోంది.అటు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇప్పటి వరకు 1,76,86,89,266 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ పూర్తయినట్లు కేంద్రం ప్రకటించింది. యువజనుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసినట్లు అధికారులు తెలిపారు.
(The above story first appeared on LatestLY on Feb 25, 2022 10:14 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

