Kargil Vijay Diwas: కార్గిల్ యుద్ధం నుంచి పాకిస్తాన్ ఇంకా పాఠాలు నేర్చుకోలేదు, శత్రుదేశానికి ధీటైన బదులిస్తామని కార్గిల్ నుంచి ప్రధాని మోదీ హెచ్చరిక
కార్గిల్ 25వ విజయ దివస్ (Kargil Vijay Diwas)ను పురస్కరించుకుని 1999 కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఘనంగా నివాళులు అర్పించారు. దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన సైనికుల త్యాగాలకు యావత్ భారతావని ఎప్పటికీ రుణపడి ఉంటుందని అన్నారు
Pakistan hasn’t learnt from its history: కార్గిల్ 25వ విజయ దివస్ (Kargil Vijay Diwas)ను పురస్కరించుకుని 1999 కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఘనంగా నివాళులు అర్పించారు. దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన సైనికుల త్యాగాలకు యావత్ భారతావని ఎప్పటికీ రుణపడి ఉంటుందని అన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi). ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పాకిస్థాన్ చరిత్ర నుంచి ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదని, భారతదేశానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్న పొరుగు దేశం ఏదైనా ధైర్యం చేసినప్పుడల్లా ఓటమిని చవిచూసిందని అన్నారు.
కార్గిల్లోని మారుమూల ద్రాస్ టౌన్ ప్రాంతంలో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా సైనికులకు నివాళులర్పించిన ప్రధాని, భారత సైనికులు చేసిన త్యాగాలు అజరామరమని అన్నారు. పాకిస్థాన్పై పదజాలంతో మాటల దాడిని ప్రారంభించిన మోడీ, పొరుగు దేశం ఉగ్రవాదం మరియు ప్రాక్సీ యుద్ధం ద్వారా సంబంధితంగా ఉండటానికి ప్రయత్నిస్తోందని, అయితే ఏదైనా దుష్ప్రవర్తనకు పాల్పడినప్పుడల్లా ఓటమిని ఎదుర్కొందని అన్నారు.ఉగ్రవాదాన్ని సమూలంగా పెకిలిస్తామని దాయాది దేశాన్ని మరోసారి గట్టిగా హెచ్చరించారు. ఆర్మీ అంటే 140 కోట్ల భారతీయుల నమ్మకం, అగ్నిపథ్ స్కీంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు, ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడిన భారత ప్రధాని
ఈ రోజు నేను మాట్లాడే మాటలు.. ఉగ్రవాదులను తయారుచేస్తున్న వారికి (పాక్ సైన్యాన్ని ఉద్దేశిస్తూ) నేరుగా వినబడతాయి. ముష్కరులను పెంచి పోషిస్తున్న వారికి నేను చెప్పేది ఒక్కటే.. వారి దుర్మార్గపు కుట్రలు ఎన్నటికీ ఫలించవు. మా దళాలు ఉగ్రవాదాన్ని నలిపివేసి.. శత్రువులకు తగిన జవాబిస్తాయి’’ అని మోదీ (PM Modi) పాక్ను హెచ్చరించారు.జమ్మూ ప్రాంతంలో తీవ్రవాద ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
1999 కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత సైనికులపై ప్రశంసలు మరియు నివాళులర్పించిన మోదీ, "కార్గిల్లో, మేము యుద్ధాన్ని గెలవడమే కాదు, సత్యం, సంయమనం మరియు శక్తికి అద్భుతమైన ఉదాహరణను అందించాము" అని అన్నారు. లడఖ్ మరియు జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిలో ప్రతి అవరోధాన్ని భారతదేశం ఓడిస్తుందని కూడా ప్రధాని అన్నారు.
యుద్ధంలో పాకిస్థాన్పై భారత్ సాధించిన విజయానికి గుర్తుగా ఈ రోజును 'కార్గిల్ విజయ్ దివస్'గా పాటిస్తారు. కార్గిల్ యుద్ధానికి లద్దాఖ్ సాక్షిగా నిలుస్తుంది. అమరుల త్యాగాలకు గుర్తుగా విజయ్ దివస్ (Kargil Vijay Diwas) జరుపుకుంటున్నాం. మన బలానికి, సహనానికి, వాస్తవాలకు ఈ విజయగాథ నిదర్శనం. దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన సైనికులు చిరకాలం గుర్తుండిపోతారు.
కార్గిల్ యుద్ధ సమయంలో సామాన్యుడిగా సైనికుల మధ్య ఉండే అదృష్టం నాకు దక్కింది. దేశం కోసం వారు చేసిన పోరాటం నా మదిలో నిలిచిపోయింది. లద్దాఖ్, జమ్మూకశ్మీర్ అభివృద్ధి కోసం ఎలాంటి సవాళ్లనైనా భారత్ అధిగమిస్తుంది. మరికొద్ది రోజుల్లో ఆర్టికల్ 370ని రద్దు చేసి ఐదేళ్లు పూర్తవుతాయి. ఇప్పుడు జమ్మూకశ్మీర్ ప్రజలు సరికొత్త భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్నారు. పెద్ద కలల గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం కశ్మీర్ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలకు నిలయంగా ఉంది. ఈ భూలోక స్వర్గం శాంతి, సౌభ్రాతృత్వం వైపు వేగంగా పరిగెడుతోంది’’ అని మోదీ తెలిపారు.
అంతకుముందు, యుద్ధ స్మారకం (Kargil War Memorial) వద్ద కార్గిల్ అమరవీరులకు ప్రధాని నివాళులర్పించారు. వీర జవాన్ల కుటుంబసభ్యులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా షింకున్ లా టన్నెల్ ప్రాజెక్ట్ నిర్మాణపనులను ప్రధాని మోదీ ప్రారంభించారు. టన్నెల్ నిర్మాణ ప్రాంతం వద్ద వర్చువల్గా తొలి బ్లాస్ట్ చేశారు. 4.1 కిలోమీటర్ల పొడవైన ఈ ట్విన్ ట్యూబ్ టన్నెల్ను 15,800 అడుగుల ఎత్తులో నిర్మించనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో సాయుధ దళాలను వేగంగా తరలించేందుకు, సైనిక సామగ్రిని చేరవేసేందుకు ఈ సొరంగం సమర్థంగా ఉపయోగపడనుంది. దీని నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సొరంగంగా గుర్తింపు సాధించనుంది.
(The above story first appeared on LatestLY on Jul 26, 2024 08:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

