Maharashtra: థానేలో దారుణం, మహిళ గొంతు నులిమి, తలను బాది హత్య చేసిన అగంతకులు, కనపడకుండా మహిళ మృతదేహాన్ని సోఫా బెడ్‌ లోపల దాచేశారు., కేసు నమోదు చేసుకున్న పోలీసులు
Dead Representational Image (Photo Credits ANI)

Thane, Feb 17: మహారాష్ట్రలోని థానే జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ముంబై నగరంలో మహిళను హత్య చేసి మృతదేహాన్ని (Woman's Dead Body ) సోఫా బెడ్‌ లోపల దాచారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డోంబివిలిలో నివాసం ఉంటున్న 33 ఏండ్ల సుప్రియా షిండే మంగళవారం తన ఇంట్లో అనుమానాస్పదంగా మరణించింది. ఆ రోజు ఉదయం తనకు ఒంట్లో బాగోలేదని, కుమారుడ్ని స్కూల్‌కు తీసుకెళ్లాలని పొరుగింటి వ్యక్తిని కోరింది. అయితే స్కూల్‌ తర్వాత కూడా కుమారుడ్ని ఆమె తీసుకెళ్లలేదు.

దీంతో స్కూల్‌ టీచర్‌ ఆ మహిళ పొరుగింటి వారిని సంప్రదించారు. అయితే సుప్రియా ఇంట్లో కూడా కనిపించలేదు. దీంతో ఆఫీస్‌లో ఉన్న ఆమె భర్తకు సమాచారం ఇచ్చారు. ఆఫీస్‌ నుంచి వచ్చిన భర్త, బంధువులు ఇల్లంతా గాలించారు. చివరకు సోఫా బెడ్‌ లోపల సుప్రియా మృతదేహాన్ని ( Woman's Dead Body Found In Sofa Bed) గుర్తించారు. కాగా, గుర్తు తెలియని వ్యక్తులు ఆ మహిళ గొంతు నులిమి, తలను బాది హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

పెళ్లి వేడుకల్లో విషాదం, బావిలో పడి 13 మంది మృతి, బావిపై నిల్చొని వేడుక చూస్తుండగా ఘటన, మృతులంతా మహిళలే, వారిలో 9 మంది బాలికలు

మంగళవారం మధ్యాహ్నం 12.30 తర్వాత ఈ ఘటన జరిగినట్లు అంచనా వేశారు. పోస్ట్‌మార్టం కోసం మహిళ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను హత్య చేసినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆమెను ఎందుకు చంపేశారనే దానిపై ఇంకా ఎటువంటి ఆధారాలు లభించలేదు.