Train Accident in Tamil Nadu: గూడ్స్ రైలుని ఢీకొన్న భాగమతి ఎక్స్‌ ప్రెస్.. పట్టాలుతప్పిన 12 కోచ్ లు.. చెలరేగిన మంటలు.. 19 మందికి గాయాలు .. తమిళనాడులో ఘటన (వీడియోతో)

తమిళనాడులోని తిరువళ్లూరులో ఘోర రైలు ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి ఓ గూడ్స్ రైలుని మైసూర్-దర్భంగా భాగమతి ఎక్స్‌ ప్రెస్‌ ప్రమాదవశాత్తు ఢీ కొట్టింది.

Train Accident in Tamil Nadu: గూడ్స్ రైలుని ఢీకొన్న భాగమతి ఎక్స్‌ ప్రెస్.. పట్టాలుతప్పిన 12 కోచ్ లు..  చెలరేగిన మంటలు.. 19 మందికి గాయాలు .. తమిళనాడులో ఘటన (వీడియోతో)
Train Accident (Credits: X)

Chennai, Oct 12: తమిళనాడులోని (Tamil Nadu) తిరువళ్లూరులో ఘోర రైలు ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి ఓ గూడ్స్ రైలుని మైసూర్-దర్భంగా భాగమతి ఎక్స్‌ ప్రెస్‌ ప్రమాదవశాత్తు (Train Accident) ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎక్స్‌ ప్రెస్ రైలులోని 12 కోచ్‌ లు పట్టాలు తప్పాయి. రెండు కోచ్ లకు  మంటలు వ్యాపించాయి. 19 మంది ప్రయాణికులు గాయపడ్డారని పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి 8:50 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. అదే ట్రాక్‌ పై నిలిచివున్న ఓ గూడ్స్ రైలుని వెనుక నుంచి వచ్చిన దర్భంగా ఎక్స్‌ ప్రెస్ ఢీకొట్టిందని రైల్వే వర్గాలు తెలిపాయి.

బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారనున్న ఉపరితల ఆవర్తనం, రానున్న మూడు రోజుల పాటు తెలంగాణకు వర్ష సూచన, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

పలు రైళ్లు దారి మళ్లింపు

భాగమతి రైలు ప్రమాదం కారణంగా చెన్నై- గూడూరు ప్రాంతంలో మూడు రైళ్లు తిరుచిరాపల్లి -హౌరా ఎక్స్‌ ప్రెస్, ఎర్నాకులం -టాటానగర్ ఎక్స్‌ ప్రెస్, కాకినాడ- ధన్‌ బాద్ స్పెషల్ ఎక్స్‌ ప్రెస్‌ నిలిచిపోయాయి. వీటిని ఇతర మార్గాల్లో మళ్లించాలని యోచిస్తున్నట్టు రైల్వే అధికారులు చెప్పారు.

ఏపీకి పొంచిఉన్న వాయుగుండం ముప్పు.. సోమవారం నుంచి భారీ వర్షాలకు అవకాశం.. వాతావరణ శాఖ హెచ్చరికలు

(The above story first appeared on LatestLY on Oct 12, 2024 08:58 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).