Kejriwal Comments On BJP: సీబీఐ, ఈడీలను నాకు ఒక్కరోజు అప్పగిస్తే బీజేపీలో సగం మంది జైల్లో ఉంటారు.. ఆప్ అధినేత కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు.. దర్యాప్తు సంస్థలన్నీ బీజేపీ చేతుల్లో ఉన్నాయని మండిపాటు
ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు ఇటీవల కాలంలో పెరిగిపోవడం పట్ల ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఈ క్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలను 24 గంటల పాటు తనకు అప్పగిస్తే బీజేపీలోని సగం మంది నేతలు జైల్లో ఉంటారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Newdelhi, Nov 25: ఈడీ (ED), ఐటీ (IT), సీబీఐ (CBI) దాడులు ఇటీవల కాలంలో పెరిగిపోవడం పట్ల ఢిల్లీ సీఎం (Delhi CM), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) స్పందించారు. ఈ క్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలను 24 గంటల పాటు తనకు అప్పగిస్తే బీజేపీలోని (BJP) సగం మంది నేతలు జైల్లో ఉంటారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తమ నేతలు సత్యేంద్ర జైన్, మనీష్ సిసోడియా అవినీతిపరులని బీజేపీ చెబుతుందని, అవన్నీ అబద్దాలేనని ధ్వజమెత్తారు. కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ బీజేపీ చేతిలోనే ఉన్నాయని అన్నారు. తమకు వ్యతిరేకంగా అనేక కేసులు పెట్టారని కేజ్రీవాల్ మండిపడ్డారు. మనీష్ సిసోడియా లిక్కర్ స్కాంలో రూ.10 కోట్లు తిన్నాడని అంటున్నారని, వారి చేతుల్లో ఉన్న దర్యాప్తు సంస్థల సాయంతో ఆ విషయం నిరూపించవచ్చు కదా? అని నిలదీశారు.
ఆప్ నేతలపై 200 కేసులు నమోదు చేసినా, ఒక్కటీ నిరూపించలేకపోయారని స్పష్టం చేశారు. 150 కేసుల్లో తమ నేతలకు క్లీన్ చిట్ వచ్చిందని, మిగిలిన కేసులు పెండింగ్ లో ఉన్నాయని కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేజ్రీవాల్ పై వ్యాఖ్యలు చేశారు.
(The above story first appeared on LatestLY on Nov 25, 2022 08:36 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

