AAP Manifesto: ఉచిత విద్య, యమునా నది క్లీన్, 24 గంటల విద్యుత్ సరఫరా, ఢిల్లీ శాసనసభ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టో విడుదల చేసిన ఆప్, రెండు భాగాలుగా మేనిఫెస్టో విడుదల
ఢిల్లి శాసనసభ ఎన్నికల సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తన మేనిఫెస్టోను(AAP Manifesto) విడుదల చేసింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా(Manish Sisodia) ఆధ్వర్యంలో మేనిఫెస్టోను విడుదల చేసింది. నాణ్యమైన విద్య, ఆరోగ్యం, పరిశుభ్రమైన తాగు నీరు, 24 గంటల విద్యుత్ సరఫరా అందజేస్తామని ఆప్ (AAP) తన మేనిఫెస్టోలో పేర్కొంది. యమునా నదిని శుభ్రం చేస్తామని, సిసిటివి నెట్వర్క్ను మరింత పటిష్టం చేస్తామని ఆప్ పేర్కొంది.
New Delhi, February 4: ఢిల్లి శాసనసభ ఎన్నికల సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తన మేనిఫెస్టోను(AAP Manifesto) విడుదల చేసింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా(Manish Sisodia) ఆధ్వర్యంలో మేనిఫెస్టోను విడుదల చేసింది. నాణ్యమైన విద్య, ఆరోగ్యం, పరిశుభ్రమైన తాగు నీరు, 24 గంటల విద్యుత్ సరఫరా అందజేస్తామని ఆప్ (AAP) తన మేనిఫెస్టోలో పేర్కొంది. యమునా నదిని శుభ్రం చేస్తామని, సిసిటివి నెట్వర్క్ను మరింత పటిష్టం చేస్తామని ఆప్ పేర్కొంది.
Delhi Assembly Elections 2020-Congress Manifesto
దేశ రాజధాని ప్రజలందరికీ నాణ్యమైన విద్య, ఆరోగ్యం, సురక్షిత నీరు, 24 గంటల విద్యుత్ అందిస్తామని భరోసా ఇచ్చింది. ఇంటింటికీ రేషన్ సరుకుల సరఫరా, పది లక్షల మంది సీనియర్ సిటిజన్లకు ఉచిత యాత్రాసౌకర్యం కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తూ ఢిల్లీ (Delhi) ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా స్పష్టం చేశారు. రెండు భాగాలుగా రూపొందిన మేనిఫెస్టోలో తొలి భాగం పది హామీలతో ఇప్పటికే విడుదల కాగా రానున్న ఐదేళ్లలో ఏం చేస్తామనేది రెండవ భాగంలో ఆప్ పొందుపరించింది.
Delhi Assembly Elections 2020-BJP Manifesto
ప్రభుత్వం 2015లో ఆమోదించిన ఢిల్లీ జన్ లోక్పాల్ బిల్లు నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నట్టు తెలిపింది. పాఠశాల విద్యలో ప్రవేశపెట్టిన హ్యాపినెస్, ఎంటర్ప్రెన్యూర్షిప్ కరిక్యులమ్ విజయవంతమైన క్రమంలో త్వరలో దేశభక్తికి సంబంధించిన సిలబస్ను ప్రవేశపెడతామని పేర్కొంది.
నీ పని నీవు చూసుకో, మోదీ మా దేశ ప్రధాని
ప్రపంచ శ్రేణి రహదారుల నిర్మాణం, యమునా నదీతీరంలో అభివృద్ధి పనులు, ఢిల్లీ మెట్రో విస్తరణ, యువతకు స్పోకెన్ ఇంగ్లీష్లో శిక్షణ, పారిశుద్ధ కార్మికుల సంక్షేమ చర్యలు వంటి పలు హామీలను ఆప్ తన మేనిఫెస్టోలో గుప్పించింది. ఇంటింటికీ రేషన్ సరుకుల సరఫరా, పది లక్షల మంది సీనియర్ సిటిజన్లకు ఉచిత యాత్రాసౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది.
(The above story first appeared on LatestLY on Feb 04, 2020 03:49 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

