Sidhu Moose Wala Murder: పంజాబీ సింగర్‌ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో కీలక మలుపు, ఇది తన ముఠా పనే అని గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ తెలిపినట్లుగా వార్తలు

పంజాబీ సింగర్‌ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అనుమానితుడిగా భావిస్తున్న గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌.. నేరం తన ముఠా పనే అని అంగీకరించినట్లు తెలుస్తోంది. పంజాబీ సింగర్‌సిద్ధూ మూసే వాలా హత్యను తన ముఠా సభ్యులే చేశారని విచారణలో బిష్ణోయ్‌, పంజాబ్‌ పోలీసుల వద్ద చెప్పినట్లు సమాచారం.

Sidhu Moosewala (Pic Credit- Instagram)

పంజాబీ సింగర్‌ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అనుమానితుడిగా భావిస్తున్న గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌.. నేరం తన ముఠా పనే అని అంగీకరించినట్లు తెలుస్తోంది. పంజాబీ సింగర్‌సిద్ధూ మూసే వాలా హత్యను తన ముఠా సభ్యులే చేశారని విచారణలో బిష్ణోయ్‌, పంజాబ్‌ పోలీసుల వద్ద చెప్పినట్లు సమాచారం. నిన్నటిదాకా(గురవారం) అసలు తనకు హత్యతో సంబంధం లేదని వాదిస్తూ వచ్చాడు బిష్ణోయ్‌. ఈ క్రమంలో తాజాగా.. విక్కీ మిద్దుఖేరా తన అన్న అని, అతని హత్యకు ప్రతీకారంగానే ఇప్పుడు సిద్ధూని తన ముఠా మట్టుబెట్టిందని బిష్ణోయ్‌ పోలీసులతో వెల్లడించినట్లు సమాచారం.

అయితే ఈ హత్యలో తన ప్రమేయం లేదని, తీహార్‌ జైల్లో ఉన్న తాను కనీసం తన ఫోన్‌ను కూడా ఉపయోగించడం లేదని బిష్ణోయ్‌ వెల్లడించాడు. అంతేకాదు సిద్ధూ హత్యను జైలులోని టీవీ ద్వారానే తెలుసుకున్నా అని బిష్ణోయ్‌ తెలిపాడు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement