India vs Australia: ఆస్ట్రేలియాతో ఐదో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు, 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా, ఆస్ట్రేలియా గడ్డపై టీ20 సిరీస్‌లో భారత్ ఘనమైన రికార్డు కంటిన్యూ..

బ్రిస్బేన్ గబ్బా మైదానంలో వర్షం మరోసారి ఆటను అడ్డుకున్నా.. భారత జట్టు టీ20 సిరీస్ విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో ఆస్ట్రేలియాపై సిరీస్‌ను కైవసం చేసుకుంది.శనివారం జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌కు వర్షం, పిడుగులు అడ్డుగా నిలిచాయి.

Jasprit Bumrah in action for India (Photo Credit:X@BCCI)

బ్రిస్బేన్ గబ్బా మైదానంలో వర్షం మరోసారి ఆటను అడ్డుకున్నా.. భారత జట్టు టీ20 సిరీస్ విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో ఆస్ట్రేలియాపై సిరీస్‌ను కైవసం చేసుకుంది.శనివారం జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌కు వర్షం, పిడుగులు అడ్డుగా నిలిచాయి. ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే వర్షం మొదలవడంతో మ్యాచ్ నిలిచిపోయింది. పరిస్థితులు మెరుగుపడకపోవడంతో అంపైర్లు చివరికి మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ బౌలింగ్ ఎంచుకోవడంతో, భారత్ బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ దూకుడుగా ఆడి మొదటి 4.5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 52 పరుగులు చేశారు. అభిషేక్ శర్మ 13 బంతుల్లో 23 (1 ఫోర్, 1 సిక్సర్), గిల్ 16 బంతుల్లో 29 (6 ఫోర్లు) పరుగులతో అజేయంగా ఉన్నారు. భారత్ భారీ స్కోరు చేసేలా కనిపించిన దశలో వర్షం రూపం మార్చి మ్యాచ్‌ను నిలిపేసింది.

మైదానం ఆటకు అనుకూలంగా లేకపోవడంతో చివరకు మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో సిరీస్‌లో ముందంజలో ఉన్న భారత్ విజేతగా నిలిచింది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దు కాగా, రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిచింది. అయితే తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో భారత్ అద్భుత ప్రదర్శనతో విజయం సాధించి 2-1 ఆధిక్యం సాధించింది. చివరి మ్యాచ్ రద్దయినందున ఆ ఆధిక్యమే భారత్‌కు సిరీస్ విజయం అందించింది.

ఈ విజయంతో ఆస్ట్రేలియా గడ్డపై భారత్ తమ అజేయ రికార్డును కొనసాగించింది. గత 17 ఏళ్లుగా భారత్ ఆస్ట్రేలియా నేలపై ఏ టీ20 సిరీస్‌ను కూడా కోల్పోలేదు. ఇది మరోసారి టీమ్ ఇండియా ఆధిపత్యాన్ని రుజువు చేసింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement