Manu Bhaker and Neeraj Chopra Chatting Video: భారత అథ్లెట్లు మను బాకర్, నీరజ్ స్పెషల్ చిట్ చాట్.. వీళ్ల మధ్య ఏం జరుగుతుందంటూ ఆసక్తిగా అడుగుతున్న నెటిజన్లు (వీడియోతో)
పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. భారత అథ్లెట్లు మను బాకర్, నీరజ్ చోప్రా మధ్య జరుగుతున్న సంభాషణ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
Newdelhi, Aug 12: పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. భారత అథ్లెట్లు మను బాకర్ (Manu Bhaker), నీరజ్ చోప్రా (Neeraj Chopra) మధ్య జరుగుతున్న సంభాషణ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. అంతేకాదు.. మను బాకర్ తల్లి సుమేధా బాకర్ కూడా నీరజ్ తో మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది. ఈ రెండు వీడియోలను చూసిన నెటిజన్లు ‘మను బాకర్, నీరజ్ చోప్రా మధ్య లవ్ ట్రాక్ స్టార్ట్ అయిపోయింది', 'ఫ్యూచర్ ఇండియన్ అథ్లెట్ కపుల్', 'బెస్ట్ కపుల్', 'నీరజ్ సిగ్గుపడుతున్నాడు' అంటూ కామెంట్ చేస్తున్నారు.
Neeraj Chopra and Manu Bhakar talking to each other. 🌟pic.twitter.com/ghL9iSB2hz
— Tanuj Singh (@ImTanujSingh) August 11, 2024
ఇద్దరూ రాణించారు
వీడియో సంగతి అటుంచితే, ఈ ఒలింపిక్స్లో మను రెండు కాంస్య పతకాలు సాధించింది. దీంతో స్వాతంత్య్రం తర్వాత ఒకే ఒలిపింక్స్ లో రెండు పతకాలు అందుకున్న అథ్లెట్ గా ఆమె నిలిచింది. మరోవైపు నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ఫైనల్ లో రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించాడు.
(The above story first appeared on LatestLY on Aug 12, 2024 10:20 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

