Andhra Pradesh Medical Apathy: స్కూటీపై చిన్నారి మృతదేహం తరలింపు ఘటనపై స్పందించిన డిప్యూటీ సీఎం, సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నట్లు వెల్లడి
విశాఖలో దారుణం చోటు చేసుకుంది. అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందిన 15 రోజుల శిశువును స్వగ్రామానికి తరలించడానికి అంబులెన్స్ ఏర్పాటు చేయకపోవడంతో (Andhra Pradesh Medical Apathy) చిన్నారి మృతదేహంతో ద్విచక్రవాహనంపై తల్లిదండ్రులు 120కి.మీ. ప్రయాణించారు.
Visakhapatnam, Feb 17: విశాఖలో దారుణం చోటు చేసుకుంది. అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందిన 15 రోజుల శిశువును స్వగ్రామానికి తరలించడానికి అంబులెన్స్ ఏర్పాటు చేయకపోవడంతో (Andhra Pradesh Medical Apathy) చిన్నారి మృతదేహంతో ద్విచక్రవాహనంపై తల్లిదండ్రులు 120కి.మీ. ప్రయాణించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం కుముడు గ్రామానికి చెందిన చిన్న మత్స్యరాజు, మహేశ్వరి దంపతులకు ఈ నెల 2వ తేదీన పాడేరు ఆస్పత్రిలో మగ శిశువు జన్మించాడు.
బరువు తక్కువగా ఉండటంతో పాటు శ్వాస సంబంధిత సమస్యతో జన్మించడం వల్ల పాడేరు ఆస్పత్రి వైద్యులు కేజీహెచ్ పిల్లల వార్డుకు రిఫర్ చేశారు. అదే రోజున శిశువును కేజీహెచ్ పిల్లల వార్డులో చేర్పించారు. అప్పటి నుంచి ఎన్ఐసీయూ వార్డులో వెంటిలేటర్పై చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. ఈ విషయాన్ని వైద్యులు కేజీహెచ్లోని గిరిజన సెల్ ఇన్చార్జి రామకృష్ణకు తెలిపారు.
జయమంగళ వెంకటరమణకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికిన సీఎం జగన్, వీడియో ఇదిగో..
చిన్నారి మృతదేహం స్వగ్రామానికి తరలించాలని తల్లిదండ్రులు కేజీహెచ్ ఎస్టీ సెల్ విభాగాన్ని సంప్రదించగా అధికారులు అంబులెన్సు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో తల్లిదండ్రులు ద్విచక్రవాహనంపై (Couple Forced To Carry Child’s Body) పాడేరు వరకు మృతదేహాన్ని తీసుకొచ్చారు. అప్పటికే ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో పాడేరు జిల్లా ఆసుపత్రి అంబులెన్సు ఏర్పాటు చేసి, బాధితులను అందులో స్వగ్రామానికి తరలించింది.
ఇదిలా ఉంటే ఆస్పత్రి వర్గాల కథనం మరోలా ఉంది. శిశువు మృతదేహం తరలింపునకు వాహనం సిద్ధం చేస్తూండగానే.. తండ్రి ద్విచక్ర వాహనంపై తీసుకొని వెళ్లినట్టు గిరిజన సెల్ ఇన్చార్జి రామకృష్ణ..పాడేరు డీఎంహెచ్వో, ఐటీడీఏ పీవోకు సమాచారమిచ్చారు. ఈ విషయం కలెక్టర్ సుమిత్కుమార్ దృష్టికి కూడా వెళ్లడంతో ఆయన తక్షణం స్పందించారు. కలెక్టర్ ఆదేశాలతో సిబ్బంది మృత శిశువును తీసుకెళ్తున్న స్కూటీని పాడేరు వద్ద గుర్తించారు. అక్కడి నుంచి అంబులెన్స్లో కుముడు గ్రామానికి తరలించారు. కేజీహెచ్ సిబ్బంది సరిగా స్పందించనందుకే తామిలా తీసుకొచ్చామని తల్లిదండ్రులు తెలిపారు.
ఈ ఘటనపై విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్లను సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నట్టు డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర తెలిపారు. సాలూరులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐటీడీఏ అంబులెన్స్కు ఆయిల్ పట్టించుకుని వస్తామని సిబ్బంది తెలిపినప్పటికీ వినకుండా సదరు వ్యక్తులు ఎవరి ప్రోద్బలంతోనో వెళ్లిపోయారన్నారు. అయినప్పటికీ మార్గం మధ్యలో వారిని గుర్తించి, అంబులెన్స్లో శిశువు మృతదేహాన్ని తరలించారని తెలిపారు.
ఈ విషయంలో వాస్తవాలు తెలుసుకోకుండా సీఎంకు మానవత్వం లేదంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇష్టానుసారం మాట్లాడటం తగదన్నారు. ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి, గిరిజనులకు మంచి వైద్యం కోసం సీఎం ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. కాగా, ఈ ఘటనపై కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.అశోక్కుమార్ విచారణ చేస్తున్నారు. రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.
(The above story first appeared on LatestLY on Feb 17, 2023 11:18 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

