Bike Accident On Flyover: ముగ్గురు మైనర్ల ప్రాణాలను తీసిన అతివేగం.. హైదరాబాద్ లో ఆరాంఘర్ ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి (వీడియో)
మైనర్ల చేతికి వాహనాలు ఇవ్వకూడదని పోలీసులు ఎంత మొత్తుకున్నా తల్లిదండ్రులు ఏ మాత్రం పట్టించుకోవట్లేదు. పెద్దవారు చేసే ఇలాంటి తప్పిదాలతో పిల్లలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
Hyderabad, Jan 27: మైనర్ల (Minors) చేతికి వాహనాలు ఇవ్వకూడదని పోలీసులు ఎంత మొత్తుకున్నా తల్లిదండ్రులు ఏ మాత్రం పట్టించుకోవట్లేదు. పెద్దవారు చేసే ఇలాంటి తప్పిదాలతో పిల్లలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ మండలం శివరాంపల్లి క్రాస్ రోడ్ సమీపంలో ఆరాంఘర్ ఫ్లైఓవర్ మీద తాజాగా జరిగిన ప్రమాదమే (Bike Accident) ఇందుకు ఉదాహరణ. ఆరాంఘర్ ఫ్లైఓవర్ (Aramghar Flyover)పై ఓ బైక్ డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరొకరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. సోమవారం అర్ధరాత్రి రాత్రి ఒంటి గంటకు ప్రమాదం జరిగింది.
ఫ్లైఓవర్ మీద యాక్సిడెంట్.. ముగ్గురు యువకులు మృతి
రాజేంద్రనగర్ మండలం శివరాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం
ఆరాంఘర్ ఫ్లైఓవర్పై డివైడర్ను ఢీకొన్న ఓ ద్విచక్రవాహనం
ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి
మృతులను బహదూరుపురాకు చెందిన… pic.twitter.com/tSOG8sXSxh
— BIG TV Breaking News (@bigtvtelugu) January 28, 2025
అదే కారణం
ప్రమాదంలో మరణించిన ముగ్గురు మైనర్ బాలురుగా పోలీసులు (Police) గుర్తించారు. బహదూర్ పురా నుంచి ఆరాంఘర్ వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న స్కూటీ ప్రమాదానికి గురైనట్టు తెలిపారు. అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Jan 28, 2025 08:44 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

