Hyderabad Mobility Update: ట్రాఫిక్ కష్టాలకు పరిష్కారం దిశగా హైదరాబాద్.. మొబిలిటీ ప్రాజెక్టులకు వేగం..

తెలంగాణ ప్రభుత్వం 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనే ప్రతిష్టాత్మక లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. ఈ భారీ లక్ష్య సాధనలో భాగంగా మౌలిక సదుపాయాలు, రవాణా, విద్య, పారిశ్రామిక ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి మరింత బలమైన మద్దతును కోరుతూ పలు కీలక ప్రతిపాదనలను పునరుద్ధరించింది.

Hyderabad Mobility Update: తెలంగాణ ప్రభుత్వం 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనే ప్రతిష్టాత్మక లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. ఈ భారీ లక్ష్య సాధనలో భాగంగా మౌలిక సదుపాయాలు, రవాణా, విద్య, పారిశ్రామిక ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి మరింత బలమైన మద్దతును కోరుతూ పలు కీలక ప్రతిపాదనలను పునరుద్ధరించింది. దేశంలోని ప్రధాన ఆర్థిక నగరాలను కవర్ చేస్తూ ఎం-6 టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని, అలాగే ప్రతి నగరానికి రూ.1 లక్ష కోటి చొప్పున మొత్తం రూ.6 లక్షల కోట్ల పట్టణ మౌలిక సదుపాయాల నిధిని కేటాయించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.

ఈ బృహత్ ప్రణాళికలో భాగంగా హైదరాబాద్ కేంద్రంగా అనేక కీలక ప్రాజెక్టులను ప్రతిపాదించారు. ముఖ్యంగా రూ.38,595 కోట్ల అంచనా వ్యయంతో 7 కారిడార్లలో 122.9 కిలోమీటర్ల మేర హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-II ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంతో చేపట్టాలని కోరారు. దీనితో పాటు శంషాబాద్‌లో హై-స్పీడ్ రైల్ హబ్, ప్రాంతీయ రింగ్ రైల్, అలాగే హైదరాబాద్‌ను బెంగళూరు, చెన్నై, పూణే వంటి నగరాలతో అనుసంధానించే కొత్త రైలు మార్గాల మద్దతును కోరారు. రహదారుల అభివృద్ధిలో భాగంగా రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర, దక్షిణ కారిడార్లు, హైదరాబాద్-అమరావతి-బందర్ పోర్ట్ ఎక్స్‌ప్రెస్‌వే, ఎన్‌హెచ్-765 వెంబడి మన్ననూరు-శ్రీశైలం మధ్య నాలుగు లేన్ల ఎలివేటెడ్ కారిడార్లకు వేగవంతమైన అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్.. తెలంగాణను ముంచెత్తుతున్న వర్షాలు.. రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు తప్పవని ఐఎండీ హెచ్చరిక..

కేవలం రవాణా రంగానికే కాకుండా, విద్య మరియు పారిశ్రామిక రంగానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) ఏర్పాటు కోసం ఇప్పటికే 200 ఎకరాల భూమిని కేటాయించినట్లు పేర్కొంటూ కేంద్ర ఆమోదం కోరింది.

ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 కింద ప్రాజెక్టులను కేటాయించాలని, ఫ్యూచర్ సిటీలో ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ 2.0 ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని కోరింది. మరోవైపు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, తుమ్మిడిహట్టి బ్యారేజీ వంటి నీటిపారుదల ప్రాజెక్టులపై కూడా దృష్టి సారించింది. ఈ మౌలిక సదుపాయాల విస్తరణతో రాష్ట్రంలో ఆర్థిక వృద్ధి వేగవంతం కావడంతో పాటు, పౌర సేవలపై పడే అదనపు భారాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement