Telangana Assembly Elections 2023: హుస్నాబాద్ నుంచి ఎన్నిక‌ల శంఖారావం పూరించనున్న సీఎం కేసీఆర్, ఈ నెల 15న బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 15న భారత రాష్ట్ర సమితి అభ్యర్థులతో సమావేశంకానున్నారు. తెలంగాణ భవన్‌లో జరిగే సమావేశంలో అభ్యర్థులకు బీ ఫారాలను అందజేయనున్నారు.

Telangana Assembly Elections 2023: హుస్నాబాద్ నుంచి ఎన్నిక‌ల శంఖారావం పూరించనున్న సీఎం కేసీఆర్, ఈ నెల 15న బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల
CM KCR (Photo/x/TS CMO)

Hyd Oct 9: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 15న భారత రాష్ట్ర సమితి అభ్యర్థులతో సమావేశంకానున్నారు. తెలంగాణ భవన్‌లో జరిగే సమావేశంలో అభ్యర్థులకు బీ ఫారాలను అందజేయనున్నారు. ఇక అదేరోజున పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. అదే రోజు నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ క్ర‌మంలో అక్టోబ‌ర్ 15వ తేదీ నుంచి ముఖ్య‌మంత్రి కేసీఆర్ జిల్లాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు.

తెలంగాణ‌తో సహా అయిదు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి, ఆగిపోనున్న శంకుస్థాపనలు, ఆవిష్కరణలు, షెడ్యూల్ చేసుకున్న కార్యక్రమాలు రద్దు

15న సాయంత్రం హైదరాబాద్‌ నుంచి బయలుదేరి.. హుస్నాబాద్‌ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. 16న జనగామ, భువనగిరి నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే బహిరంగ సభలకు హాజరవుతారు. 17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో జరిగే సభలకు హాజరవుతారు. 18న మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో జరిగే మీటింగ్‌లో, సాయంత్రం 4 గంటలకు మేడ్చల్‌లో జరిగే సభకు హాజరై ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.

(The above story first appeared on LatestLY on Oct 09, 2023 09:20 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).