Warangal Shocker: వరంగల్ జిల్లాలో దారుణం, మహిళను అడవిలోకి లాక్కెళ్లి ముగ్గురు సామూహిక అత్యాచారం, సహకరించిన మరో ఇద్దరు మిత్రులు
గ్రేటర్ వరంగల్లో ఓ వివాహితపై 5 మంది కామాంధులు తెగబడ్డారు. అడవిలోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. దీనికి సంబంధించిన వివరాలను వరంగల్ ఏనుమాముల పోలీసు స్టేషన్లో ఏసీపీ కృపాకర్ మంగళవారం వెల్లడించారు.
Mulugu, May 3: గ్రేటర్ వరంగల్లో ఓ వివాహితపై 5 మంది కామాంధులు తెగబడ్డారు. అడవిలోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. దీనికి సంబంధించిన వివరాలను వరంగల్ ఏనుమాముల పోలీసు స్టేషన్లో ఏసీపీ కృపాకర్ మంగళవారం వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక పైడిపెల్లి గ్రామానికి చెందిన బాధితురాలు గత నెల 20న తోటి గ్రామస్థురాలితో కలిసి ఆరెపల్లి గ్రామానికి బయలుదేరారు.
ములుగు జిల్లా జంగాలపల్లికి చెందిన రవి, చల్వాయికి చెందిన నాగరాజులు కారులో వచ్చి వారిద్దరినీ అపహరించారు. ములుగు వైపు వెళ్లే దారిలో గ్రామస్థురాలిని దించేసిన నిందితులు, కొంచెం దూరం వెళ్లిన తర్వాత హన్మకొండకు చెందిన లక్ష్మణ్, జంగాలపల్లికి చెందిన రమేష్, వర్దన్నపేట ఫిరంగిగడ్డకు చెందిన సుధాకర్ అనే ముగ్గురిని కారులో ఎక్కించుకున్నారు.
బాధితురాలిని బెదిరించి కారును మేడారం అటవీ ప్రాంతంవైపు తీసుకెళ్లారు. అక్కడ బాధితురాలిపై ముగ్గురు కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. మరో ఇద్దరు ఈ అకృత్యానికి సహకరించారు. అనంతరం ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని హెచ్చరించి, ములుగులో బస్సు ఎక్కించారు. సదరు బాధితురాలు ములుగురోడ్డు వద్ద బస్సుదిగి తన భర్తకు ఫోన్ చేసింది. ఎక్కడికి వెళ్లావని నిలదీయడంతో ఆమె భయపడి కరీంనగర్ జిల్లాలోని పుట్టింటికి వెళ్లిపోయింది.
పుట్టింటి దగ్గర ఉన్నట్లు భార్య చెప్పడంతో అక్కడకు వెళ్లిన భర్తకు సామూహిక అత్యాచారం సంగతి తెలిసింది. దీంతో బాధితురాలు, ఆమె భర్త ఏప్రిల్ 29న కలసి ఫిర్యాదు చేయగా పోలీసులు ఐదుగురు యువకులతోపాటు సామూహిక అత్యాచారానికి సహకరించిన మరో మహిళపై కూడా గ్యాంగ్రేప్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అనంతరం ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించారు.
(The above story first appeared on LatestLY on May 03, 2023 03:53 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

