MLAs Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో ట్విస్ట్, తీర్పు తుది కాపీ వచ్చేదాకా ఆదేశాలను సస్పెన్షన్లో ఉంచాలని తెలిపిన హైకోర్టు, అప్పటివరకు తీర్పును ఇంప్లిమెంట్ చేయొద్దని కోరిన సిట్ తరపున రాష్ట్ర అడ్వొకేట్ జనరల్
తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల తుది కాపీ వచ్చేదాకా.. కేసు సీబీఐ కి ఇస్తూ ఇచ్చిన ఆదేశాలను సస్పెన్షన్లో ఉంచాలని, తీర్పును ఇంప్లిమెంట్ చేయొద్దని సిట్ తరపున రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ కోరారు. దీనికి హైకోర్టు సింగిల్ బెంచ్ న్యాయమూర్తి సానుకూలంగా స్పందించారు.
Hyd, Dec 26: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు (TRS MLA Poaching Case) సీబీఐ చేతికి వెళ్లాలన్న ఆదేశాలు వెలువడిన కాసేపటికే మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల తుది కాపీ వచ్చేదాకా.. కేసు సీబీఐ కి ఇస్తూ ఇచ్చిన ఆదేశాలను సస్పెన్షన్లో ఉంచాలని, తీర్పును ఇంప్లిమెంట్ చేయొద్దని సిట్ తరపున రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ కోరారు. దీనికి హైకోర్టు సింగిల్ బెంచ్ న్యాయమూర్తి సానుకూలంగా స్పందించారు.
ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు.. ఆర్డర్ కాపీ అందిన తర్వాతే అప్పీల్కు వెళ్తామని ధర్మాసనానికి స్పష్టం చేశారు ఏజీ. దీంతో అప్పీల్కు వెళ్లే అవకాశం ఇస్తామని న్యాయమూర్తి ఏజీకి స్పష్టం చేశారు. అంతకు ముందు.. కేసును సిట్ దర్యాప్తు నుంచి సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అయితే.. తక్షణమే సీబీఐకి అప్పగించాలని తెలిపినప్పటికీ.. ఏజీ అభ్యర్థనను హైకోర్టు న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నారు.
దీంతో హైకోర్టు ఆర్డర్ కాపీ అందిన తర్వాతే సిట్ అప్పీల్కు వెళ్లనుంది. ఈ పరిణామంతో.. డివిజన్ బెంచ్లో తీర్పు తర్వాతే సీబీఐ దర్యాప్తు ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక హైకోర్టు ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాతే తన కార్యాచరణ ప్రకటిస్తామని ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి మీడియాకు తెలిపారు.
(The above story first appeared on LatestLY on Dec 26, 2022 08:32 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

