Bengaluru Shocker: వీడియో ఇదిగో, ఇద్దరు పిల్లల్ని చంపి సాఫ్ట్‌వేర్ దంపతులు ఆత్మహత్య, బెంగుళూరులో విషాదకర ఘటన, కారణం ఏంటంటే..

ఇద్దరు పసిపిల్లలను చంపి ఓ సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్, అతని భార్య తన జీవితాన్ని ముగించుకున్న విషాద సంఘటన సోమవారం బెంగళూరులో చోటు చేసుకుంది. బెంగళూరులోని సదాశివనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Techie, Wife Die by Suicide After Killing Their 2 Children

ఇద్దరు పసిపిల్లలను చంపి ఓ సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్, అతని భార్య తన జీవితాన్ని ముగించుకున్న విషాద సంఘటన సోమవారం బెంగళూరులో చోటు చేసుకుంది. బెంగళూరులోని సదాశివనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను ఉత్తరప్రదేశ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ 38 ఏళ్ల అనూప్, అతని భార్య 35 ఏళ్ల రాఖీ, వారి పిల్లలు ఐదేళ్ల అనుప్రియ, రెండేళ్ల ప్రియాంష్‌గా గుర్తించారు.

మధ్యప్రదేశ్‌ నిరసనల్లో అపృశతి.. లైక్స్ కోసం పెట్రో పోసుకుంటే..వెనుక నుండి నిప్పు అంటించేశారు?...వైరల్ వీడియో

ఈ దంపతుల పెద్ద పాప అనుప్రియ ప్రత్యేక అవసరాలు గల బిడ్డ కావడంతో ఆ యువకుల తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఇంటి పనిమనిషి పోలీసులకు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనూప్ ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి వరకు విషయాలు సాధారణంగానే ఉన్నాయని, దంపతులు సంతోషంగా ఉన్నారని పని మనిషి పోలీసులకు తెలిపింది.

Techie, Wife Die by Suicide After Killing Their 2 Children

సోమవారం ఉదయం ఇంటికి వెళ్లిన పని మనిషికి కుటుంబసభ్యుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో హత్య-ఆత్మహత్య వెలుగులోకి వచ్చింది. అనుప్రియ పరిస్థితి చూసి మనస్థాపానికి గురైన దంపతులు తమ జీవితాలను అంతం చేసుకోవాలని, అంతకుముందే తమ పిల్లలను చంపాలని నిర్ణయం తీసుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. మొదట తమ పిల్లలకు ఆహారంలో విషమిచ్చి చంపి, ఆ తర్వాత తమ నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తోంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement