Manipur Politics: బీజేపీ కూటమికి షాకిచ్చిన నితీష్ కుమార్, మణిపూర్‌లో ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్లు కీలక ప్రకటన

భారతీయ జనతా పార్టీ (బిజెపి) మిత్రపక్షం నితీష్ కుమార్ జనతాదళ్ యునైటెడ్ (జెడియు) మణిపూర్ ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది. ఇది కాషాయ పార్టీకి బిగ్ షాక్‌గా చెప్పవచ్చు. మణిపూర్ అసెంబ్లీలో జనతాదళ్ యునైటెడ్‌కు ఒకే ఒక్క ఎమ్మెల్యే మొహమ్మద్ అబ్దుల్ నాసిర్ ఉన్నారు

Nitish Kumar's JDU Withdraws Support To BJP-Led Government In Manipur

Imphal, Jan 22: భారతీయ జనతా పార్టీ (బిజెపి) మిత్రపక్షం నితీష్ కుమార్ జనతాదళ్ యునైటెడ్ (జెడియు) మణిపూర్ ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది. ఇది కాషాయ పార్టీకి బిగ్ షాక్‌గా చెప్పవచ్చు. మణిపూర్ అసెంబ్లీలో జనతాదళ్ యునైటెడ్‌కు ఒకే ఒక్క ఎమ్మెల్యే మొహమ్మద్ అబ్దుల్ నాసిర్ ఉన్నారు. మణిపూర్ అసెంబ్లీలో జెడి(యు)కి మొదట్లో ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు, అయితే సెప్టెంబర్ 2022లో వారిలో ఐదుగురు అధికార పార్టీలో విలీనమై బిజెపిలో చేరారు.

వీడియో ఇదిగో, ప్రధాని నరేంద్రమోదీ పాదాలను తాకబోయిన నితీష్ కుమార్, కాళ్లని వెనక్కి తీసుకున్న పీఎం

మణిపూర్‌లో బిజెపి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలని జెడి(యు) తీసుకున్న నిర్ణయం అధికారిక లేఖ ద్వారా వెల్లడైంది. మణిపూర్‌లో బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి ఇకపై జేడీయూ మద్దతివ్వదని జేడీయూ మణిపూర్ అధ్యక్షుడు క్షేత్రమయూమ్ బీరేన్ సింగ్ ప్రకటించారు. ఉపసంహరణ ప్రకటన లేఖలో ఇలా ఉంది: “మణిపూర్‌లో బిజెపి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి జనతాదళ్ (యునైటెడ్), మణిపూర్ యూనిట్ మద్దతు ఇవ్వదని మా ఏకైక ఎమ్మెల్యే Md. అబ్దుల్ నాసిర్‌ను ప్రతిపక్షంగా పరిగణిస్తారని ఇందుమూలంగా పునరుద్ఘాటించారు.

జేడీయూ ఉపసంహరణ మణిపూర్‌లోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రభావితం చేస్తుందా?

బిజెపి నేతృత్వంలోని మణిపూర్ ప్రభుత్వం నుండి జనతాదళ్ యునైటెడ్ నిష్క్రమించడం రాష్ట్రంలో పూర్తి మెజారిటీని కలిగి ఉన్నందున కాషాయ పార్టీ పట్టును ప్రభావితం చేయదు. మణిపూర్ అసెంబ్లీలో జెడి(యు)కి కేవలం ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు. లిలాంగ్ నియోజకవర్గం నుండి మొహమ్మద్ అబ్దుల్ నాసిర్ ఎన్నికయ్యారు.

మణిపూర్ ప్రభుత్వం నుండి NPP మరియు KPA మద్దతు ఉపసంహరించుకున్నప్పుడు..

నవంబర్ 2024లో, మణిపూర్‌లో కుకీలు, మెయిటీస్ మధ్య జాతి హింస కొనసాగుతున్న నేపథ్యంలో కాన్రాడ్ సంగ్మా నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP) మణిపూర్‌లో BJP నేతృత్వంలోని ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది. జెపి నడ్డాను ఉద్దేశించి కాన్రాడ్ సంగ్మా రాసిన లేఖలో..బీరెన్ సింగ్ నాయకత్వంలోని మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం సంక్షోభాన్ని పరిష్కరించడంలో, సాధారణ స్థితిని పునరుద్ధరించడంలో పూర్తిగా విఫలమైందని మేము గట్టిగా భావిస్తున్నాము" అని రాశారు.ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, నేషనల్ పీపుల్స్ పార్టీ మణిపూర్ రాష్ట్రంలో బీరెన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుంది, తక్షణమే అమలులోకి వస్తుంది," అని NPP చీఫ్ చెప్పారు.

ఆగస్ట్ 2023లో, రాష్ట్రంలో జాతి హింసను పేర్కొంటూ బిజెపికి చెందిన మరో మిత్రపక్షం - కుకీ పీపుల్స్ అలయన్స్ - ఎన్‌డిఎ నుండి వైదొలిగింది. మణిపూర్‌లోని బీరెన్ సింగ్ ప్రభుత్వంతో తమ పార్టీ బంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు కెపిఎ అధ్యక్షుడు టోంగ్‌మాంగ్ హౌకిప్ గవర్నర్ అనుసూయా ఉయికీకి రాసిన లేఖలో తెలియజేశారు.

ముచ్చటగా 9వ సారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం..మిత్రులు మారుతున్నా...సీఎం సీటు నుంచి కదలడం లేదు..ఇదే నితీష్ మార్కు రాజకీయం..

2022 మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ ఆరు స్థానాలను గెలుచుకుంది. అయితే ఎన్నికలు ముగిసిన కొన్ని నెలల తర్వాత ఐదురుగు జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. 60 మంది సభ్యుల అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి నాగా పీపుల్స్ ఫ్రంట్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రులు మద్దతిస్తున్నారు. బీజేపీకి మద్దతు ఉపసంహరించుకుంటే బీహార్‌లో అభివృద్ది ఆగిపోతుందనే అనుమానాల్ని జేడీయూ నేతలు కొట్టి పారేస్తున్నారు. కేంద్ర ఎన్‌డీఏ కూటమిలో జేడీయూ ప్రముఖ పాత్ర పోషిస్తుంది.కాబట్టి అది బీజేపీకే నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అంటున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement