ఇటీవల దేశ సరిహద్దుల్లో తప్పిపోయిన అరుణాచల ప్రదేశ్ యువకుడు మిరామ్ టారోర్ ను చైనా భారత దేశానికి అప్పగించిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్ వేదికగా తెలిపారు. దీనికి సంబంధించి అన్ని నియమాలను పాటించారని, మెడికల్ టెస్టులను పూర్తి చేశారని కిరణ్ రిజిజు ట్వీట్ లో తెలిపారు. కాగా మిరామ్ టారోర్ అనే యువకుడు ఈ నెల 18న వేటకు వెళ్లినప్పుడు చైనా సైనికులు అపహరించారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఎంపీ తెలిపిన సంగతి విదితబే.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)