Delhi Air Pollution: ఢిల్లీని వణికిస్తున్న వాయు కాలుష్యం, బీఎస్-3 పెట్రోల్, బీఎస్-4 డీజిల్ కార్లపై నిషేధం విధించిన ఆప్ సర్కారు, చలికి తోడు భారీగా పేరుకుపోతున్న పొగమంచు
దేశ రాజధానిలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఆప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కాలుష్యాన్ని వెదలజల్లే వాహనాలపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. బీఎస్-3 పెట్రోల్, బీఎస్-4 డీజిల్ కార్లపై నిషేధం విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు వాహనాలపై నిషేధం కొనసాగుతుందని చెప్పారు.
- Read in
- తెలుగు
దేశ రాజధానిలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఆప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కాలుష్యాన్ని వెదలజల్లే వాహనాలపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. బీఎస్-3 పెట్రోల్, బీఎస్-4 డీజిల్ కార్లపై నిషేధం విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు వాహనాలపై నిషేధం కొనసాగుతుందని చెప్పారు. కాగా గత రెండు రోజులుగా ఢిల్లీలో చలితీవ్రత పెరుగుతున్నది. చలికి తోడు భారీగా పొగమంచు పేరుకుపోతున్నది.ఫలితంగా వాయు కాలుష్యంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అలాగే ఎన్సీఆర్ పరిధిలోని రాష్ట్రాల్లో పంట వ్యర్థాలు కాల్చకుండా చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాలను అధికారులు కోరారు.వాయు కాలుష్యం మెరుగుపడితే ముందుగానే ఆంక్షలు సడలించనున్నట్లు పేర్కొన్నారు.
Here' s Update
Delhi Air Pollution: Temporary Ban on Plying of BS-III Petrol, BS-IV Diesel Four-Wheelers in National Capital From Tomorrow #DelhiAirPollution #AirPollution #Pollution https://t.co/eVRzCDavfD
— LatestLY (@latestly) January 9, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 09, 2023 10:17 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

