IMD Weather Alert: ఐఎండీ వాతావరణం హెచ్చరిక.. మరింతగా బలపడిన రుతుపవనాలు.. పలు రాష్ట్రాల్లో జూలై 28 వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఈ రాష్ట్రాలకు బిగ్ అలర్ట్..

భారతదేశంలోని అత్యధిక ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింతగా బలపడ్డాయి. భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించిన వివరాల ప్రకారం.. కనీసం మరొక వారం రోజుల పాటు, అంటే జూలై 28 వరకు దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Tomorrow Weather Update: IMD Issues Heavy Rain Alert Across Several States (photo-PTI)

IMD Weather Alert: భారతదేశంలోని అత్యధిక ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింతగా బలపడ్డాయి. భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించిన వివరాల ప్రకారం.. కనీసం మరొక వారం రోజుల పాటు, అంటే జూలై 28 వరకు దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హిమాలయ పర్వత ప్రాంతాల నుంచి కొంకణ్ తీరం వరకు, అలాగే మధ్య, ఈశాన్య భారతదేశంలో వానలు ఊపందుకోనుండటంతో వరదలు.. కొండచరియలు విరిగిపడే ప్రమాదముందని అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో గుజరాత్, మధ్య మహారాష్ట్ర ప్రాంతాలు తీవ్ర ప్రభావానికి గురవుతున్నాయి. గుజరాత్‌లో నేడు కుండపోత వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. కొంకణ్, గోవాలలో జూలై 24, 25, 28 తేదీలలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. మధ్య మహారాష్ట్రలో జూలై 26 నుంచి 28 మధ్య మళ్లీ తీవ్రమైన వర్షాలు రానున్నాయి. తీరం వెంబడి గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉండటంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, ఒడిశా మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని ఐఎమ్‌డీ సూచించింది.

బంగాళాఖాతంలో ద్రోణి.. తెలుగు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్.. మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు.. ఐఎండీ లేటెస్ట్ అప్‌డేట్ ఇదిగో..

ఉత్తర, మధ్య, ఈశాన్య భారతంలో కూడా వర్షాల ప్రభావం స్పష్టంగా కనిపించనుంది. జూలై 28 వరకు హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, ఉత్తరాఖండ్‌లలో విస్తారంగా వర్షాలు పడతాయి. పంజాబ్, హర్యానా, ఢిల్లీలలో జూలై 27, 28 తేదీల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. తూర్పు రాజస్థాన్‌లో నిరంతర వానలు పడనున్నాయి. అలాగే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, విదర్భ ప్రాంతాల్లో పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయి. పశ్చిమ బెంగాల్, సిక్కిం, జార్ఖండ్, బీహార్, ఒడిశాలతో పాటు అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలలో జూలై 28 వరకు భారీ వర్షాలు కొనసాగుతాయి.

దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక, తెలంగాణ, తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, తమిళనాడులలో బలమైన ఈదురుగాలులతో (గంటకు 60 కి.మీ వేగంతో) కూడిన వర్షాలు పడతాయి. కేరళ, కర్ణాటక, తెలంగాణలలో భారీ వర్ష సూచన ఉంది. రాబోయే 24 గంటల్లో గుజరాత్‌లోని నవ్‌సారి, వల్సాద్, మహారాష్ట్రలోని ముంబై (సిటీ & సబర్బన్), థానే, పాల్ఘర్, రాయ్‌గఢ్, నాసిక్, రత్నగిరి, అలాగే జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గామ్, కతువా, కుల్గామ్ వంటి జిల్లాల్లో ఆకస్మిక వరదలు (Flash Floods) వచ్చే ముప్పు ఉందని ఐఎమ్‌డీ తీవ్ర హెచ్చరికలు చేసింది.

ఈ పరిస్థితుల దృష్ట్యా హిమాలయ ప్రాంతాలు, కొంకణ్ తీరం, గోవా, కేరళ వంటి ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులు తమ ప్రయాణాలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం లేదా వాతావరణ సమాచారాన్ని నిశితంగా పరిశీలించిన తర్వాతే బయలుదేరడం మంచిది. పట్టణ ప్రాంతాల్లో నీరు నిలవడం, ట్రాఫిక్ నిలిచిపోవడం, తక్కువ దృశ్యమానత (Low Visibility) ఏర్పడటం, కొండ ప్రాంతాల్లో రోడ్లు మూసివేత, కొండచరియలు విరిగిపడే ప్రమాదాలు ఉన్నందున ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement