RBI: ఆర్బీఐ కీలక నిర్ణయం, రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్, భారీ నష్టాల్లోకి జారుకున్న స్టాక్ మార్కెట్లు
ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరిగిపోతూ ఉండటంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అధికారికంగా ప్రకటించారు. దీంతో రెపో రేటు 4.40 శాతానికి చేరుకుంది.
ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరిగిపోతూ ఉండటంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అధికారికంగా ప్రకటించారు. దీంతో రెపో రేటు 4.40 శాతానికి చేరుకుంది. పెంచిన రేటు తక్షణమే అమల్లోకి వస్తుందని శక్తికాంత దాస్ ప్రకటించారు. ద్రవ్యోల్బణం అదుపు చేసేందుకు సర్దుబాటు దోరణిని ఉపసంహరించుకునే యోచనలో ఉన్నట్లు గవర్నర్ వెల్లడించారు. ఈ నిర్ణయం వెలువడటంతో మధ్యాహ్నం 2.20 గంటల సమయానికి సెన్సెక్స్ 956 పాయింట్ల భారీ నష్టపోయి 567019 వద్ద నిఫ్టీ 300 పాయింట్లు నష్టపోయి 16781 పాయింట్ల వద్ద ట్రేడింగ్ను కొనసాగిస్తుంది.
మే 2020 తర్వాత తొలిసారి ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచింది. ఆహార ద్రవ్యోల్బణం అధికంగా ఉండనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా గోధుమ సంక్షోభం ఏర్పడినట్లు ఆయన తెలిపారు. దీని వల్ల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల నూనె ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నట్లు దాస్ తెలిపారు.