Karnataka Assembly Elections 2023: వీడియో ఇదిగో, కర్ణాటకలో జేడీఎస్‌దే అధికారం, కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై కన్నడిగులు విరక్తి చెందారు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి

రానున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం మాదేనని జనతాదళ్ (ఎస్‌) (JD(S)) నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. ఈసారి ప్రాంతీయ పార్టీకే విజయాన్ని కట్టబెట్టాలని కన్నడిగులు నిర్ణయించుకున్నారని, అందుకోసం ఇప్పటికే మానసికంగా సిద్ధమయ్యారని చెప్పారు.

HD Kumaraswamy (Photo Credit: ANI/File)

రానున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం మాదేనని జనతాదళ్ (ఎస్‌) (JD(S)) నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. ఈసారి ప్రాంతీయ పార్టీకే విజయాన్ని కట్టబెట్టాలని కన్నడిగులు నిర్ణయించుకున్నారని, అందుకోసం ఇప్పటికే మానసికంగా సిద్ధమయ్యారని చెప్పారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ అసమర్థ పాలనతో కన్నడ ప్రజలు విరక్తి చెందారని ఆయన తెలిపారు.

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కన్నడ ప్రజలు తమకు భారీ మెజారిటీ విజయం కట్టబెట్టబోతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.కర్ణాటక ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్‌ 13న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు తెలిపింది. నామినేషన్‌ల స్వీకరణకు ఏప్రిల్‌ 20 వరకు గడువు నిర్ణయించింది. మే 10న మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్‌ నిర్వహించి, మే 13న ఫలితాలను వెల్లడించనున్నట్లు తెలిపింది.

Here's ANI Update

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement