Bharat Nyay Yatra in 2024: మణిపూర్ నుంచి ముంబై దాకా మరోసారి రాహుల్ గాంధీ పాదయాత్ర, భారత్ న్యాయయాత్ర పేరుతో మళ్లీ ప్రజల్లోకి..
కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ.. భారత్ న్యాయయాత్ర పేరుతో పాదయాత్ర ద్వారా మరోసారి జనంలో వెళ్లనున్నారు. ఈ విషయాన్ని బుధవారం ఏఐసీసీ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. భారత్ న్యాయయాత్ర పేరుతో రాహుల్ ఈసారి పాదయాత్ర చేయబోతున్నారని.. ఇది రాజకీయ యాత్ర ఏమాత్రం కాదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియా సమావేశంలో తెలిపారు.
కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ.. భారత్ న్యాయయాత్ర పేరుతో పాదయాత్ర ద్వారా మరోసారి జనంలో వెళ్లనున్నారు. ఈ విషయాన్ని బుధవారం ఏఐసీసీ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. భారత్ న్యాయయాత్ర పేరుతో రాహుల్ ఈసారి పాదయాత్ర చేయబోతున్నారని.. ఇది రాజకీయ యాత్ర ఏమాత్రం కాదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియా సమావేశంలో తెలిపారు.
రెండవ సారి ఈశాన్యం నుంచి పశ్చిమ భారతం వైపు రాహుల్ గాంధీ యాత్ర సాగనుంది. జనవరి 14వ తేదీన ఈ యాత్ర ప్రారంభం అయ్యి 14 రాష్ట్రాలు.. 85 జిల్లాల గుండా ఉంటుంది. మణిపూర్లో మొదలై.. ముంబై దాకా దాదాపు 6,200 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతుంది. మార్చి 20వ తేదీతో యాత్ర ముగుస్తుంది.ఈసారి యాత్రకు భారత్ జోడో యాత్ర అని కాకుండా.. భారత్ న్యాయయాత్ర అని పేరు పెట్టారు. ఈ సారి రాహుల్ పాదయాత్ర బస్సు ద్వారా, కాలి నడక ద్వారా కొనసాగుతుందని కేసీ వేణుగోపాల్ స్పష్టత ఇచ్చారు.ఈ యాత్రలో యువత, మహిళలు, అణగారిన వర్గాలతో రాహుల్ ముఖాముఖి అవుతారని వెల్లడించారు.
Here's Video