Delhi: ఢిల్లీలో పట్టపగలే నడిరోడ్డుపై దోపిడి, తుపాకీతో బెదిరింపులకు దిగి దోపిడీకి పాల్పడిన ఇద్దరు అగంతకులు, సీసీ టీవీ పుటేజీ వైరల్

ఢిల్లీలోని వివేక్‌ విహార్‌ ప్రాంతంలో నడిరోడ్డుపైనే ఇద్దరు దుండగులు తుపాకీతో బెదిరింపులకు దిగి దోపిడీకి పాల్పడ్డారు. యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరిని అప్పటికే బైక్‌పై వచ్చి మాటువేసి ఉన్న ఇద్దరు దుండగులు అడ్డుకున్నారు.

CCTV Footage (Photo Credits: ANI/Twitter)

ఢిల్లీలోని వివేక్‌ విహార్‌ ప్రాంతంలో నడిరోడ్డుపైనే ఇద్దరు దుండగులు తుపాకీతో బెదిరింపులకు దిగి దోపిడీకి పాల్పడ్డారు. యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరిని అప్పటికే బైక్‌పై వచ్చి మాటువేసి ఉన్న ఇద్దరు దుండగులు అడ్డుకున్నారు. ఆ తర్వాత జేబులో నుంచి గన్‌ను తీసి బెదిరించారు. వారి నుంచి బంగారు బ్రాస్‌లెట్‌, తదితర విలువైన వస్తువులు ఇవ్వాలని బెదిరించారు. ఆ తర్వాత వాటిని తీసుకొని పరారయ్యారు. ఈ దోపిడీ దృశాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement