Ambati Rayudu Retirement, IPL Final 2023: ఐపీఎల్ నుంచి అంబటి రాయుడు రిటైర్ అవుతున్నట్లు ప్రకటన, సుదీర్ఘ కెరీర్ కు స్వస్తి పలికిన తెలుగు క్రికెటర్..
CSK జట్టు ఆటగాడు అంబటి రాయుడు IPL నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫైనల్ మ్యాచ్ తర్వాత రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు అంబటి రాయుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ , గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్కు ముందు చెన్నై అభిమానులకు పెద్ద దెబ్బ తగిలింది. ఈ మ్యాచ్ తర్వాత CSK జట్టు ఆటగాడు అంబటి రాయుడు IPL నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫైనల్ మ్యాచ్ తర్వాత రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు అంబటి రాయుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. చెన్నై, గుజరాత్లు 2 మంచి జట్లు అని అంబటి తన ట్వీట్లో రాశారు. 204 మ్యాచ్లు 14 సీజన్లు, 11 ప్లేఆఫ్లు, 8 ఫైనల్స్, 5 ట్రోఫీలు. ఈ రాత్రికి 6వ ట్రోఫీని ఆశిస్తున్నాను. ఇది చాలా సుదీర్ఘ ప్రయాణం. ఈ రాత్రి జరిగే ఫైనల్ ఐపీఎల్లో నా చివరి మ్యాచ్ అని నిర్ణయించుకున్నాను. ఈ గొప్ప టోర్నమెంట్లో ఆడటం నాకు బాగా నచ్చింది. అందరికి ధన్యవాదాలు.
2010లో ఆడిన IPL సీజన్లో అంబటి రాయుడు అరంగేట్రం చేసాడు. IPLలో చెన్నై సూపర్ కింగ్స్తో పాటు, ముంబై ఇండియన్స్ జట్టులో కూడా రాయుడు ముఖ్యమైన భాగంగా ఉన్నాడు. 2018 సీజన్లో అంబటి రాయుడు తొలిసారి చెన్నై జట్టులో భాగమయ్యాడు. ఇప్పటి వరకు రాయుడు 203 ఐపీఎల్ మ్యాచ్ల్లో 28.29 సగటుతో మొత్తం 4329 పరుగులు చేశాడు. అంబటి రాయుడు గత సీజన్లో కూడా హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే తర్వాత దాన్ని వెనక్కి తీసుకున్నాడు.