Palnadu Horror: ఫోన్‌లో మాట్లాడుతున్న కూతురు.. అనుమానంతో డాబాపై నుంచి కిందికి తోసేసిన తండ్రి.. ఏపీలో ఘటన

కుమార్తె సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుండడంతో అనుమానించిన ఓ తండ్రి ఘోరానికి పాల్పడ్డాడు. ఆమెను డాబా పైనుంచి కిందికి తోసేశాడు. ప్రస్తుతం ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఏపీలోని పల్నాడు జిల్లా యడ్లపాడులో జరిగిందీ ఘటన.

Palnadu Horror: ఫోన్‌లో మాట్లాడుతున్న కూతురు.. అనుమానంతో డాబాపై నుంచి కిందికి తోసేసిన తండ్రి.. ఏపీలో ఘటన
Man kills daughter for constantly engaging on phone Representational Image

Palnadu, Feb 11: కుమార్తె (Daughter) సెల్‌ఫోన్‌లో (Mobile) మాట్లాడుతుండడంతో అనుమానించిన ఓ తండ్రి ఘోరానికి పాల్పడ్డాడు. ఆమెను డాబా పైనుంచి కిందికి తోసేశాడు. ప్రస్తుతం ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఘాతుకానికి పాల్పడిన తండ్రిని పోలీసులు (Police) అరెస్ట్ చేశారు. ఏపీలోని (AP) పల్నాడు (Palnadu) జిల్లా యడ్లపాడులో జరిగిందీ ఘటన. బాధితురాలు 16 ఏళ్ల విద్యార్థిని అని పోలీసులు తెలిపారు.

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. సోమవారం ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ.. అంగప్రదక్షిణం టికెట్లు నేటి నుంచే అందుబాటులోకి..

రెండు రోజుల క్రితం ఇంట్లో సెల్‌ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతుండగా చూసిన తండ్రి ఆమెను మందలించాడు. దీంతో ఆమె డాబాపైకి ఎక్కి తిరిగి ఫోన్‌లో మాట్లాడడం మొదలుపెట్టింది. అది చూసిన తండ్రి ఆమె ఎవరో యువకుడితో మాట్లాడుతోందని అనుమానించి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

ఇదేందయ్యా.. ఇది?? మంత్రిపై దురద పుట్టించే పౌడర్ చల్లడమా?? మధ్యప్రదేశ్ లో నవ్వుతెప్పిస్తున్న ఘటన.. వీడియో ఇదిగో!

(The above story first appeared on LatestLY on Feb 11, 2023 09:16 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).