Itching Powder On Minister: ఇదేందయ్యా.. ఇది?? మంత్రిపై దురద పుట్టించే పౌడర్ చల్లడమా?? మధ్యప్రదేశ్ లో నవ్వుతెప్పిస్తున్న ఘటన.. వీడియో ఇదిగో!
భోపాల్ లో బీజేపీ ఆధ్వర్యంలో రథయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి బ్రిజేంద్ర సింగ్ యాదవ్ కూడా పాల్గొన్నారు. రథయాత్ర సాగుతుండగా ఓ వ్యక్తి మంత్రిని లక్ష్యంగా చేసుకుని దురద పుట్టించే పౌడర్ చల్లాడు.
Bhopal, Feb 11: తమకు కావాల్సిన పనులు చేయని ప్రజాప్రతినిధులపై ఇంకు (Ink) దాడి చేయడం చూశాం. అయితే, మధ్యప్రదేశ్ (Madhyapradesh) లో ఓ మంత్రిపై జరిగిన విచిత్ర దాడి నవ్వులు పూయిస్తుంది. విషయమేంటంటే.. భోపాల్ (Bhopal) లో బీజేపీ (BJP) ఆధ్వర్యంలో రథయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి బ్రిజేంద్ర సింగ్ యాదవ్ (Brijendra Singh Yadav) కూడా పాల్గొన్నారు. రథయాత్ర సాగుతుండగా ఓ వ్యక్తి మంత్రిని లక్ష్యంగా చేసుకుని దురద పుట్టించే పౌడర్ చల్లాడు.
దాంతో, మంత్రి గోక్కోవడం.. అనంతరం కడుక్కోవడం మొదలుపెట్టారు. తన దురద బాధను అక్కడున్నవారికి నవ్వుతూ వివరించగా, వారు కూడా ఆయనతో కలిసి నవ్వులు పూయించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
(The above story first appeared on LatestLY on Feb 11, 2023 08:47 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

