KTR On CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ గులాం, 'చీప్ మినిస్టర్' అని మండిపడ్డ కేటీఆర్, రుణమాఫీ చేసే వరకు వదిలిపెట్టమని హెచ్చరిక

సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డి ఢిల్లీ గులాం అని, చీప్ మినిస్టర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్..రుణమాఫీ చేసే వరకు కాంగ్రెస్ నేతలను వదిలిపెట్టమన్నారు.

BRS KTR Says CM Revanth Reddy is Delhi Ghulam, cheap minister

Hyd, Aug 21:సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డి ఢిల్లీ గులాం అని, చీప్ మినిస్టర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్..రుణమాఫీ చేసే వరకు కాంగ్రెస్ నేతలను వదిలిపెట్టమన్నారు.

బీఆర్ఎస్ పార్టీ అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదని.. భారత రైతు సమితి అని కొత్త అర్ధం చెప్పారు. రైతులకు ఎప్పటిలోగా రుణమాఫీ చేస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్‌లోనూ రుణమాఫీ పూర్తిగా కాలేదన్నారు. కోస్గి మండలంలో 22వేల మంది రైతులు రుణాలు తీసుకుంటే కేవలం 8వేల మందికి మాత్రమే రుణమాఫీ వచ్చిందన్నారు.

రుణమాఫీ కోస రైతులు ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడి చేస్తున్నారని, దీనికి కాంగ్రెస్ నేతలు ఏం సమాధానం చెబుతారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బజారు భాష మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ కోసం ఆందోళన చేస్తున్న రైతులపై ఎందుకు కేసులు నమోదు చేస్తున్నారని ప్రశ్నించారు.ఫోన్ ట్యాపింగ్‌ పై కేంద్ర అనుమతి అవసరం లేదు, హైకోర్టులో కేంద్రం కౌంటర్, బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్‌పై తమకు సమాచారం లేదని వెల్లడి

రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ ది ఒక మాట అయితే మంత్రులది...రుణమాఫీ విషయంలో మంత్రులకే సమన్వయం లేదని విమర్శలు చేశారు. రేపు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Congress MLC Candidates: మరోసారి చట్టసభల్లోకి రాములమ్మ, ఎట్టకేలకు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ సీటు, ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

BRSLP Meeting Update: 11న బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం.. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన శాసనసభాపక్షం సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

Advertisement
Advertisement
Share Now
Advertisement