ED Notices To MLC Kavitha: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు, రేపు విచారణకు హాజరుకావాలంటూ ఆదేశం, రామచంద్రపిళ్లై స్టేట్‌మెంట్‌పై నిజానిజాలు ఆరాతీసే అవకాశం

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) ఈడీ నోటీసులు జారీ చేసింది(Ed Sent Notices). గురువారం ఈడీ ఎదుట జరిగే విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రామచంద్ర పిళ్లై కీలక విషయాలు వెల్లడించాడు.

File (Credits: Twitter)

New Delhi, March 08: ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) ఈడీ నోటీసులు జారీ చేసింది(Ed Sent Notices). గురువారం ఈడీ ఎదుట జరిగే విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రామచంద్ర పిళ్లై కీలక విషయాలు వెల్లడించాడు. తాను ఎమ్మెల్సీ కవితకు బినామీ అని, ఆమె ఆదేశాల మేరకే తాను పని చేసినట్లు ఈడీకి చెప్పాడు. ఈ నేపథ్యంలో కవితను విచారించాలని ఈడీ నిర్ణయించింది. దీంతో కవితకు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో జరిగే విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. రామచంద్ర పిళ్లైతో కలిసి కవితను (Kavitha) అధికారులు విచారించబోతున్నారు.

ఈ కేసులో గతంలోనే ఈడీ కవితను హైదరాబాద్‌లోని తన నివాసంలో విచారించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కాంలో (Delhi Liquor Scam) కవిత పాత్ర, ముడుపుల అంశం వంటి అంశాలపై కవితను ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి గతంలో దాఖలు చేసిన చార్జిషీటులో రామచంద్ర పిళ్లై పాత్రని ఈడీ ప్రస్తావించింది. పిళ్లైపై అనేక అభియోగాలు నమోదు చేసింది. కవిత తరఫున అన్ని వ్యవహారాలు ఆయనే చూసుకున్నారని చార్జిషీటులో ఈడీ పేర్కొంది. ఈ కేసులో మరో నిందితుడు సమీర్ మహేంద్రుపై దాఖలు చేసిన చార్జిషీటులో కూడా కవిత పేరును ఈడీ ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో గురువారం జరగబోయే విచారణ కీలకం కానుంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement