Weather Update: తెలంగాణలో చలిపులి పంజా, గజగజ వణుకుతున్న హైదరాబాద్, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కనిష్ఠ స్థాయికి పడిపోయిన ఉష్ణోగ్రతలు, రాష్ట్రమంతటికీ ఎల్లో అలర్ట్‌ జారీ

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలిపులి తన పంజా విసురుతోంది. రాజధాని హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా భారీగా పడిపోయాయి. దీని ఫలితంగా రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు.

Credits: Istock

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలిపులి తన పంజా విసురుతోంది. రాజధాని హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా భారీగా పడిపోయాయి. దీని ఫలితంగా రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. చాలా ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతుండటంతో, ప్రజలు బయటకు రావాలంటేనే జంకే పరిస్థితి కనిపిస్తోంది.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఆదివారం రాత్రి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ (యూ) ప్రాంతంలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, సంగారెడ్డి జిల్లాలోని కోహీర్‌లో 7.1 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. ఆదిలాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, నిర్మల్ వంటి పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 8 డిగ్రీల నుంచి 10 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత అధికంగా ఉండటంతో అక్కడి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

తెలంగాణలో 8.2 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు, రాష్ట్రంలోని 29 జిల్లాల్లో పెరిగిన చలి తీవ్రత, రానున్న మూడు రోజుల్లో మరింత పెరగనున్న చలి

గతేడాది ఇదే సమయానికి రాష్ట్రంలో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రత 12.1 డిగ్రీలుగా ఉంది. ఈ ఏడాది ఉష్ణోగ్రతల్లో వచ్చిన ఈ భారీ తగ్గుదల గమనార్హం. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఈ చలి తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మూడు రోజుల్లో అన్ని జిల్లాల్లో సగటున 8.6 డిగ్రీల నుంచి 13.5 డిగ్రీల మధ్య కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాష్ట్రమంతటికీ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement