Hyderabad: దుర్గం చెరువులో దూకి యువతి ఆత్మహత్య, స్పీడ్‌బోట్స్‌తో యువతి కోసం గాలిస్తున్న లేక్ పోలీసులు, అనారోగ్యంతోనే ఆత్మహత్య చేసుకుందని వార్తలు

హైదరాబాద్ పరిధిలోని దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి పై నుంచి యువ‌తి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న (Young Woman commits suicide) చోటుచేసుకుంది.

durgam cheruvu (Photo-Twitter)

Hyd, Sep 28:హైదరాబాద్ పరిధిలోని దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి పై నుంచి యువ‌తి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న (Young Woman commits suicide) చోటుచేసుకుంది. దుర్గంచెరువుపై (Durgam Cheruvu) నిర్మించిన కేబుల్‌ బ్రిడ్జిపై నుంచి చెరువులోకి దూకుతుండగా చూసిన వాహనదారులు.. ఈ విషయాన్ని లేక్‌ పోలీసులకు తెలిపారు. దీంతో, రంగంలోకి దిగిన లేక్‌ పోలీసులు.. యువతి కోసం స్పీడ్‌బోట్స్‌తో గాలిస్తున్నారు.

కాగా, ఆత్మహత్యాయత్నం చేసిన యువతిని అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన స్వప్న(23)గా పోలీసులు గుర్తించారు. అయితే, అనారోగ్య సమస్యల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక, స్వప్నకు ఇటీవలే వివాహం జరిగినట్టు తెలుస్తోంది.కేబుల్‌ బ్రిడ్డి వద్ద స్వప్నకు సంబంధించిన హ్యాండ్‌ ఆధారంగా ఆమె ఆధారాలు సేకరించారు. దీంతో, పోలీసులు.. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో వారు కేబుల్‌ బ్రిడ్డి వద్దకు వస్తున్నట్టు తెలుస్తోంది.

మగవాడిని కూడా వదలని కామాంధులు, పురుషాంగంపై కర్రతో కొడుతూ, ప్రైవేట్ పార్టుల్లో రాడ్డు పెడుతూ సామూహిక అత్యాచారం, ఢిల్లీలో చావు బతుకుల మధ్య ఉన్న 12 ఏళ్ళ బాలుడు

ఇక, ఆమె హ్యాండ్‌ బ్యాగ్‌లో ఆసుపత్రికి సంబంధించిన పత్రాలు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. కాగా, ఇప్పటి వరకు కేబుల్‌ బ్రిడ్డిపై నుంచి దూకి దాదాపు ఎనిమిది మంది ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం.మాదాపూర్ పోలీసులు యువ‌తి శ‌వం కోసం నీటిలో గాలిస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement