Nizamabad Shocker: జంట హత్యలతో ఉలిక్కిపడిన నిజామాబాద్, తండ్రితో పాటు చిన్నాన్నను గడ్డపారతో పొడిచి చంపిన కసాయి, భూవివాదాలే కారణమంటున్న పోలీసులు

నిజామాబాద్‌ జిల్లాలో పట్టపగలే దారుణం (Nizamabad Shocker) జరిగింది.ఓ కసాయి కొడుకు భూతగాదాలతో కన్న తండ్రితో పాటు, చిన్నాన్నను హతమార్చాడు.

Image used for representational purpose only | (Photo Credits: PTI)

Mopal, August 12: నిజామాబాద్‌ జిల్లాలో పట్టపగలే దారుణం (Nizamabad Shocker) జరిగింది.ఓ కసాయి కొడుకు భూతగాదాలతో కన్న తండ్రితో పాటు, చిన్నాన్నను హతమార్చాడు. ఈ ఘటన మోపాల్‌ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. దారుణ ఘటన వివరాల్లోకెళ్తే.. మోపాల్‌కి చెందిన కర్రోళ్ల అబ్బయ్య, కర్రోళ్ల నడిపి సాయిలు ఇరువురు అన్న దమ్ములు కాగా, అబ్బయ్యకు, కుమారుడు కుర్రోళ్ళ సతీష్‌కు ఓ స్థలానికి సంబంధించిన విషయంలో గొడవల జరుగుతున్నాయి.

యువతికి బ్లీడింగ్ అవుతున్నా వదలని కామాంధుడు, నైట్ డ్యూటీలో నర్సుని రూంకి పిలిచి వైద్యుడు లైంగిక దాడి, పెళ్లి చేసుకుంటానంటూ పదే పదే అత్యాచారం

ఈ నేపథ్యంలోనే సతీష్‌ జంట హత్యలకు (Son Beats Father, Uncle To Death) పాల్పడటం గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసింది. శుక్రవారం ఉదయం 6:30 గంటల సమయంలో సతీష్ గడ్డపారతో తండ్రిని, బాబాయ్‌ని హతమార్చి నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. నిందితుడిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ తగాదాలే హత్యకు దారితీశాయని పోలీసులు చెబుతున్నారు.దీంతో గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

అయితే నిందితుడికి రెండేళ్ల నుంచి మానసిక స్థితి సరిగాలేదని గ్రామస్తులు అంటున్నారు. అబ్బయ్య, సాయిలు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Advertisement
Advertisement
Share Now
Advertisement