Norman Borlaug Award: భారతీయ మహిళా శాస్త్రవేత్త స్వాతి నాయక్ కు నార్మన్ బోర్లాగ్ అవార్డ్.. వరి సాగు చేసే చిన్నరైతులకు మేలు చేకూర్చే అనేక పరిశోధనలు చేసిన స్వాతి
భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి నాయక్ నార్మన్ బోర్లాగ్ అవార్డుకు ఎంపికయ్యారు. వరి పరిశోధనలో స్వాతి నాయక్ చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ ఏడాది ఆమెకు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ ఈ అవార్డును ప్రకటించింది.
Newdelhi, Sep 22: భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి నాయక్ (Dr. Swathi Nayak) నార్మన్ బోర్లాగ్ అవార్డు (Norman Borlaug Award)కు ఎంపికయ్యారు. వరి పరిశోధనలో స్వాతి నాయక్ చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ ఏడాది ఆమెకు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ (World Food Prize Foundation) ఈ అవార్డును ప్రకటించింది. ఒడిశాకు చెందిన స్వాతి నాయక్ ప్రస్తుతం ఢిల్లీలోని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థలో (ఐఆర్ఆర్ఐ-IRRI) శాస్త్రవేత్తగా ఉన్నారు. వరిపంట సాగు చేస్తున్న చిన్న రైతులకు అందించిన సేవలకు గాను ఆమె ఈ అవార్డు దక్కించుకున్నారు.
ఏమిటీ అవార్డు?
హరిత విప్లవ పితామహుడు, నోబెల్ బహుమతి గ్రహీత నార్మన్ ఇ. బోర్లాగ్ పేరిట ఈ అవార్డును నెలకొల్పారు. ఆకలిని నిర్మూలించి, ఆహారభద్రతకు కృషి చేసే 40 ఏళ్లలోపు వయసున్న శాస్త్రవేత్తలకు ఏటా ఈ అవార్డును ప్రకటిస్తారు.