Norman Borlaug Award: భారతీయ మహిళా శాస్త్రవేత్త స్వాతి నాయక్‌ కు నార్మన్ బోర్లాగ్ అవార్డ్.. వరి సాగు చేసే చిన్నరైతులకు మేలు చేకూర్చే అనేక పరిశోధనలు చేసిన స్వాతి

భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి నాయక్‌ నార్మన్ బోర్లాగ్ అవార్డుకు ఎంపికయ్యారు. వరి పరిశోధనలో స్వాతి నాయక్‌ చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ ఏడాది ఆమెకు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ ఈ అవార్డును ప్రకటించింది.

Credits: X

Newdelhi, Sep 22: భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి నాయక్‌ (Dr. Swathi Nayak) నార్మన్ బోర్లాగ్ అవార్డు (Norman Borlaug Award)కు ఎంపికయ్యారు. వరి పరిశోధనలో స్వాతి నాయక్‌ చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ ఏడాది ఆమెకు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ (World Food Prize Foundation) ఈ అవార్డును ప్రకటించింది. ఒడిశాకు చెందిన స్వాతి నాయక్ ప్రస్తుతం ఢిల్లీలోని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థలో (ఐఆర్ఆర్ఐ-IRRI) శాస్త్రవేత్తగా ఉన్నారు. వరిపంట సాగు చేస్తున్న చిన్న రైతులకు అందించిన సేవలకు గాను ఆమె ఈ అవార్డు దక్కించుకున్నారు.

Changes in Vande Bharat Express: సీట్ల పుష్ బ్యాక్ పెంపు, ఫుట్‌ రెస్ట్‌ కు మెరుగులు, ఏసీ సమర్థవంతంగా పనిచేసేలా మార్పులు.. ప్రయాణాన్ని సౌకర్యవంతంగా చేసేందుకు వందేభారత్‌ రైళ్లలో రైల్వేశాఖ 25 కీలక మార్పులు

Aadhaar-Voter ID Linking Row: ఓటరు ఐడీకి ఆధార్ లింక్ తప్పనిసరి కాదు, సుప్రీంకోర్టుకు తెలిపిన ఎన్నికల కమిషన్, ఫారమ్ 6, 6Bలో మార్పులు చేస్తామని వెల్లడి

ఏమిటీ అవార్డు?

హరిత విప్లవ పితామహుడు, నోబెల్ బహుమతి గ్రహీత నార్మన్ ఇ. బోర్లాగ్ పేరిట ఈ అవార్డును నెలకొల్పారు. ఆకలిని నిర్మూలించి, ఆహారభద్రతకు కృషి చేసే 40 ఏళ్లలోపు వయసున్న శాస్త్రవేత్తలకు ఏటా ఈ అవార్డును ప్రకటిస్తారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement