What Is Frozen Screen UPI Scam? యూపీఐ వినియోగదారులకు అలర్ట్.. ఫోన్ స్క్రీన్ ఒక్కసారిగా ఫ్రీజ్ అయితే జాగ్రత్త.. Fake Error Messageతో స్కామర్లు ఎలా డబ్బులు కొట్టేస్తున్నారో తెలుసా?
సోషల్ మీడియా ప్రకటనలు, అనుమానాస్పద లింక్లపై క్లిక్ చేసినప్పుడు స్మార్ట్ఫోన్ అకస్మాత్తుగా స్తంభించిపోవడం (ఫ్రీజ్ అవ్వడం) సాధారణ సాంకేతిక లోపం కాదని, అదొక ప్రమాదకరమైన డిజిటల్ స్కామ్కి సంకేతమని సైబర్ సెక్యూరిటీ నిపుణులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
What Is Frozen Screen UPI Scam? సోషల్ మీడియా ప్రకటనలు, అనుమానాస్పద లింక్లపై క్లిక్ చేసినప్పుడు స్మార్ట్ఫోన్ అకస్మాత్తుగా స్తంభించిపోవడం (ఫ్రీజ్ అవ్వడం) సాధారణ సాంకేతిక లోపం కాదని, అదొక ప్రమాదకరమైన డిజిటల్ స్కామ్కి సంకేతమని సైబర్ సెక్యూరిటీ నిపుణులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. యూజర్లలో భయాందోళనలు సృష్టించి, వారి దృష్టిని మళ్లించడం ద్వారా సున్నితమైన ఆర్థిక సమాచారాన్ని, యూపీఐ పిన్లను చేజిక్కించుకునే కొత్త తరహా ‘ఫ్రోజెన్ స్క్రీన్ యూపీఐ స్కామ్’ (Frozen Screen UPI Scam) దేశంలో వేగంగా విస్తరిస్తోంది. సంప్రదాయ ఫిషింగ్ విధానాలకు భిన్నంగా, హానికరమైన అప్లికేషన్లు (APK), సోషల్ ఇంజనీరింగ్ మరియు ఆండ్రాయిడ్ అనుమతులను ఉపయోగించి మోసగాళ్లు పరికరాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారని ఎన్డిటివి కథనం వెల్లడించింది.
దశాబ్దం ముగిసేలోపే AI మనుషులందరినీ చంపొచ్చు.. Anthropic పరిశోధకుడి సంచలన హెచ్చరిక
క్విక్ హీల్ టెక్నాలజీస్ సీఈఓ హరీష్ కుమార్, ఫ్యూచరెక్స్ ప్రతినిధి రుచిన్ కుమార్ తదితర నిపుణులు వివరించిన వివరాల ప్రకారం.. ఈ స్కామ్ వెనుక తీవ్రమైన సాంకేతిక కుట్ర దాగి ఉంది. యూజర్ ఫోన్ లేదా బ్యాంకింగ్ యాప్లో సాంకేతిక సమస్య ఉందనే భయాన్ని సృష్టించి, నకిలీ ఎర్రర్ మెసేజ్లు లేదా కస్టమర్ కేర్ పేరుతో కాల్స్ చేస్తారు. సమస్యను పరిష్కరిస్తామని నమ్మించి ఒక APK ఫైల్ను ఇన్స్టాల్ చేయిస్తారు. ఇన్స్టాల్ కాగానే ఆ యాప్ ద్వారా SMS చదివే హక్కులు, యాక్సెసిబిలిటీ, నోటిఫికేషన్ అనుమతులను మోసగాళ్లు పొందుతారు. దీనితో వారు ఫోన్లోని OTPలను అడ్డగించడం, స్క్రీన్ను రిమోట్గా నియంత్రించడం చేస్తారు. ఈ మోసానికి యూపీఐ ఎన్క్రిప్షన్ను ఛేదించాల్సిన అవసరం లేదని, యూజర్ను భయపెట్టి వారిచేతే పిన్ నమోదు చేయించడం లేదా స్క్రీన్ షేరింగ్ ద్వారా వివరాలు దొంగిలించడం ద్వారా లావాదేవీలను ఆమోదింపజేస్తారని నిపుణులు స్పష్టం చేశారు.
మోసాల బారిన పడకుండా సురక్షితంగా ఉండేందుకు నిపుణులు సూచించిన నివారణ చర్యలు, తక్షణ పరిష్కారాలు:
తక్షణ స్పందన: ఫోన్ అకస్మాత్తుగా ఫ్రీజ్ అయిన వెంటనే మొబైల్ డేటా మరియు వై-ఫై సేవలను ఆపివేయాలి. అనామక వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్ లేదా కస్టమర్ కేర్ పేరుతో వచ్చే సూచనలను ఎట్టి పరిస్థితుల్లోనూ పాటించకూడదు.
యాప్స్ తొలగింపు: సందేశాలు లేదా అపరిచిత లింక్ల ద్వారా డౌన్లోడ్ చేసిన APK ఫైళ్లను, అనుమానాస్పద అప్లికేషన్లను తక్షణమే డిలీట్ చేసి, యాక్సెసిబిలిటీ అనుమతులను రద్దు చేయాలి.
సమాచారం బహిర్గతమైతే చేయాల్సినవి: బ్యాంకింగ్ వివరాలు ముప్పులో పడ్డాయని అనిపిస్తే, వెంటనే అధికారిక మార్గాల ద్వారా బ్యాంకును సంప్రదించి ఖాతాలను బ్లాక్ చేయాలి. శుభ్రమైన వేరొక డివైజ్ ద్వారా పాస్వర్డ్లను మార్చుకోవాలి.
హెల్ప్లైన్ ఫిర్యాదు: ఆర్థిక మోసం లేదా సైబర్ దాడి జరిగినట్లు అనుమానం వస్తే తక్షణమే ‘1930’ సైబర్ హెల్ప్లైన్ నంబర్కు ఫిర్యాదు చేయాలి.
ఏ అధికారిక బ్యాంకు లేదా సేవా సంస్థ కూడా యూపీఐ సమస్యలను పరిష్కరించడానికి రిమోట్-యాక్సెస్ యాప్లను ఇన్స్టాల్ చేయమని లేదా స్క్రీన్ షేర్ చేయమని కోరదని నెటిజన్లు గ్రహించాలి. అకస్మాత్తుగా స్క్రీన్ ఫ్రీజ్ కావడం, ఆ వెంటనే అడగకుండానే కస్టమర్ కేర్ కాల్ రావడం వంటి సంకేతాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.